ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

నవతెలంగాణ –  చెన్నై : త‌మిళ‌నాడులో ఆదివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. సింగిలిప‌ట్టి – పున్న‌య‌పురం మ‌ధ్య జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ఆరుగురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. సిమెంట్ బ‌స్తాల లోడ్‌తో వెళ్తున్న ట్ర‌క్కును కారు ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్ర‌మాదం ఆదివారం తెల్ల‌వారుజామున 3:30 గంట‌ల‌కు చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవ‌ర్ నిద్ర‌లోకి జారుకోవ‌డంతోనే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాల‌ను తిరునేల్‌వేలి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Spread the love