ఆకాశాన్నంటుతున్న మామిడి ధరలు

ఆకాశాన్నంటుతున్న మామిడి ధరలుఅది తెలంగాణ అయినా ఆంధ్రాలో అయినా రైతు గోస ఒక్కటే. అకాల వర్షాలకు పిందెలు, కాయలు రాలిపోయి చాలా చోట్ల ఇరవై కిలోల బాక్స్‌ మార్కెట్‌ ధర రూ.రెండు వేలు మార్కెట్‌ ధర పలుకుతోంది. సహజంగా ఇంట్లో మాగడానికి ఎక్కువ సమయం పడుతుంది, అలాగే ఎక్కువ కాయలు కుళ్లిపోతున్నాయి. సాధారణంగా మామిడి, అరటి, బొప్పాయి పండ్లను పూర్తిగా పండకుండానే చెట్ల నుండి కోసి, తర్వాత వాటిని మగ్గ బెడతారు. సహజసిద్ధంగా పండటానికి ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా పండ్లను మగ్గ పెట్టడానికి ఎథ్రెల్‌ స్ప్రే చేయడం గానీ, వాటిని ఎథ్రెల్‌ ద్రవంలో ముంచడం గానీ చేస్తారు. అయితే అది శ్రమతో కూడిన పని. అదీకాక బయట అమ్మే ఎథ్రెల్‌లో కల్తీ రసాయనాలు ఉంటే సమస్యలు వస్తాయి.
పండ్ల తోటల్లో మామిడి పంట చాలా ప్రముఖమైనది. అందుకే దీన్ని పండ్లలో రారాజు అని పిలుస్తారు. మన భారతదేశంలో చాలా రకాల మామిడి వంగడాలు / రకాలు వివిధ ప్రాంతాలలో సాగవుతున్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ పంటను సాగుచేస్తున్నారు. ప్రపంచంలోనే మామిడిని పండించడంలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంలో సగం వరకు మామిడి ఉత్పత్తి మన భారత దేశంలో జరుగుతుంది. మామిడి పండులో అధిక పోషకాలు, విటమిన్‌-ఎ, సి, అలాగే మంచి రుచి ఉండడం వలన, చాలా మంది ప్రజలు ఈ పండును ఇష్టపడతారు. అలాగే మామిడిలో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మామిడి పంటను చాలా మంది రైతులు ముఖ్యమైన ఉద్యాన వాణిజ్య వంటగా సాగుచేస్తున్నారు. మామిడిని మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్‌, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు, నల్గొండ జిల్లాల్లో సాగుచేస్తున్నారు. మామిడిని పండించడానికి అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, చెట్టు అభివృద్ధి చెంది చాలా కాలం ఫలాన్నిస్తాయి.
ఏడాది ఒకసారి వచ్చే మధురమైన పంట మామిడి పంట. వేసవిలో మామిడి పచ్చడి, ఊరగాయలు, మాగాయ, మామిడి పులిహోర మామిడి పండ్లు పండ్ల రసాలు తినడానికి ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. ఈ ఏడాది కాపు సంతృప్తికరంగా లేదు, డిసెంబర్‌ జనవరి నెలల నుండి విపరీతమైన ఎండలు ఉండడంతో పూత నిలవలేదు. కాపు పూర్తిగా పలుచగా ఉంది. కొన్ని చోట్ల కాపు లేదు. గత నెల రోజులుగా హోల్‌ సేల్‌ మార్కెట్లో ధర రూ.900 నుండి 1800 వరకు బాక్స్‌కు ఉండటంతో సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. దళారులు నెలకిందట తక్కువ ధరకు చెట్లు కొని ఎక్కువ ధరకు మార్కెటు కు తరలిస్తున్నారు. వర్షాలు పడకపోవడంతో మామిడి పండు రుచి ఉండటం లేదు. మార్కెటుకు వచ్చిన మామిడి కృత్రిమ పద్ధతిలో మాగ పెడుతున్నారు. కార్బైడ్‌, స్ప్రే చేయడం, అసిటిలిన్‌ ద్రావణంలో అద్దడంతో పండు మాధుర్యం కోల్పోయింది. కొన్ని చోట్ల పంట దెబ్బతీసింది, కోయకుండా చెట్టుపైన ఉన్న కాయలకు ఉజి ఈగ బెడద ఎక్కువగా ఉంది. నిండా కాపు ఉన్న చెట్టు కాయలు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు వ్యాపారస్తులు పెడుతున్నారు. మూడు వందల చెట్లకు రెండు లక్షలు మించడం లేదు. సంవత్సర కాలం కంటికి రెప్పలా చూసుకున్న కాపలాదారుడు జీతానికి సరిపోయేటట్లు ఉంది. రైతులకు పెట్టుబడి లేక చెట్లు తీసివేసే ప్రమాదం ఉంది.
గత దశాబ్ద కాలంగా కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్స్‌, ధాన్యం నిలువ చేసుకోవడానికి వేర్‌హౌస్‌లు లేక రైతులు తీవ్ర ఇబ్బందికి గురవు తున్నారు. ప్రతి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు కానీ ఎక్కడా మార్కెట్‌ సౌకర్యం, సరకు నిల్వ సౌకర్యం, గిట్టుబాటు ధర, రవాణా సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. వేరుశెనగ వేసుకుంటే గిట్టుబాటు లేదని పత్తికి మారితే దానికీ గిట్టుబాటు లేదని, టమోటా, మిర్చీ ఫల సంప్రదాయానికి మారినా నష్టాలు మిన్నంటుతున్నాయి. దేనికి మారినా తమ బతుకులు మారక అప్పుల ఊబిలో కొట్టుకుపోతున్నారు. అది తెలంగాణ అయినా ఆంధ్రాలో అయినా రైతు గోస ఒక్కటే. అకాల వర్షాలకు పిందెలు, కాయలు రాలిపోయి చాలా చోట్ల ఇరవై కిలోల బాక్స్‌ మార్కెట్‌ ధర రూ.రెండు వేలు మార్కెట్‌ ధర పలుకుతోంది. సహజంగా ఇంట్లో మాగడానికి ఎక్కువ సమయం పడుతుంది, అలాగే ఎక్కువ కాయలు కుళ్లిపోతున్నాయి. సాధారణంగా మామిడి, అరటి, బొప్పాయి పండ్లను పూర్తిగా పండకుండానే చెట్ల నుండి కోసి, తర్వాత వాటిని మగ్గ బెడతారు. సహజసిద్ధంగా పండటానికి ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా పండ్లను మగ్గ పెట్టడానికి ఎథ్రెల్‌ స్ప్రే చేయడం గానీ, వాటిని ఎథ్రెల్‌ ద్రవంలో ముంచడం గానీ చేస్తారు. అయితే అది శ్రమతో కూడిన పని. అదీకాక బయట అమ్మే ఎథ్రెల్‌లో కల్తీ రసాయనాలు ఉంటే సమస్యలు వస్తాయి.
దీనికి ప్రత్యామ్నాయంగా, పండ్లను మగ్గబెట్టి గోదాములలో ఇథిలీన్‌ గ్యాస్‌ ఉపయోగిస్తారు. అయితే దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. రైతులకు, చిన్న వ్యాపారులకు ఆర్ధికంగా గిట్టుబాటు అవదు. కాబట్టి తక్కువ పెట్టుబడితో పండ్లను మగ్గించడానికి ప్లాస్టిక్‌ టెంట్లలో ఇథలీన్‌ గ్యాస్‌ను వదిలి పండ్లను పండబెట్టడం రూపొందించారు. ఇతర ఉద్యాన పంటలలో లాగానే, మామిడిని కూడా చాలా రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. వాటిలో ప్రధానమైనవి తేనెమంచు పురుగు, టెంక పురుగులు, వండు ఈగ, పిండిపురుగులు. ఈ ప్రధాన పురుగుల వలన కలిగే నష్టం అపారం. ఎన్ని ఎత్తులు వేసి మార్కెట్టుకు కాయలు తరలించినా ఆరుగాలం శ్రమించిన రైతుకు దక్కేది శూన్యం, దళారులకు భోజ్యం. తక్షణం రైతులను ఆదుకొని రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రులు నిర్దిష్ట ప్రణాళికతో సత్వరమే మార్కెటు, నిల్వ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మంచి ఫలాన్ని ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు.
డా. యం. సురేష్‌ బాబు

Spread the love