రేషన్ దుకాణాల్లో సామాజిక తనిఖీలు 

నవతెలంగాణ – బెజ్జంకి 
మండలంలోని అయా గ్రామాల్లో భినామి పేర్లతో ఎవరైనా రేషన్ దుకాణాలను నిర్వహిస్తున్నారా?అనే ప్రధాన అంశంగా సంబంధిత అధికారులు సామాజిక తనిఖీలు నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు రేగులపల్లి,చీలాపూర్,దాచారం గ్రామాల్లోని పలు రేషన్ దుకాణాల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ అధ్వర్యంలో సామాజిక తనిఖీలు నిర్వహించారు. బియ్యం పంపిణీలో సాంకేతిక,తూకాలు,రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరాలో ఎమైనా సమస్యలు తలెత్తున్నయా అనే అంశాలపై ప్రత్యేకంగా వివరాలు సేకరించినట్టు తనూజ తెలిపారు.తనిఖీల్లో పౌరసరఫరాల డీప్యూటీ తహసిల్దార్ ఎండీ.జైనుల్ ఆభిదీన్, ఆర్ఐ సుహసిని,అయా గ్రామాల రేషన్ డీలర్లు, అంగన్వాడీ ఉపాధ్యాయులు,ఆశా కార్యకర్తలు, వినియోగదారులు పాల్గొన్నారు.
Spread the love