సీఎంను కలిసిన సోషల్ మీడియా వారియర్స్..

నవతెలంగాణ – వేములవాడ 
సోషల్ మీడియా కన్వీనర్లతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమైనట్లుగా గురువారం వేములవాడ సోషల్ మీడియా కో కన్వీనర్ కనికరపు రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ సోషల్ మీడియా కన్వీనర్లు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పథకాలను, సమావేశాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి విశేష స్పందన వచ్చినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు సోషల్ మీడియా వేదిక ద్వారా సిద్ధంగా ఉండాలని సోషల్ మీడియా కన్వీనర్ ,కో కన్వీనర్లకు  దిశా నిర్దేశం చేసినట్లుగా వెల్లడించారు.
Spread the love