Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అడిషనల్ డీసీపీని కలిసిన సామాజిక సేవకులు 

అడిషనల్ డీసీపీని కలిసిన సామాజిక సేవకులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో  నూతన పదవి బాధ్యతలు చేపట్టిన అడిషనల్ డి. సి. పి శుభమ్ ప్రకాష్ ని  పట్టణ జాతీయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్ గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినారు. పట్వారీ తులసి రూపొందించిన స్వాతంత్ర్య దేశ భక్తుల కథనాల అంశాల పుస్తకం నీ ,  యువత నైపుణ్యాలు పుస్తకన్నీ శుభం ప్రకాష్ కి అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పట్వారి తులసి సేవలు యువత మార్గదర్శకత్వం అనీ ముఖ్యంగా రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన, హెల్మెట్ ప్రాముఖ్యత వివిధ సేవలకు నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -