కొత్త ప్రభుత్వానికి కొన్ని సూచనలు…

Some suggestions for the new government...”ఏ పాలకుడైతే తన నిర్ణయమే తుది నిర్ణయమని భావిస్తాడో అతడు అన్ని రకాల సంక్షోభాలకు కారకుడవుతాడు. ప్రజల అభి మానాన్ని కోల్పోతాడు” అంటాడు శుక్రాచార్యుడు. ప్రజల ఆకాంక్ష లకు అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చుకొని ప్రజా సంక్షేమాన్ని కోరే పాలకుడిని ప్రజలు ఎల్లప్పుడు ఆదరిస్తారు. రాచరిక వ్యవస్థను కూల దోసి ప్రజాస్వామ్య విధానాలకు ప్రజలు అలవాటుపడ్డ తరుణంలో అక్కడక్కడ నేటికి కూడా కొద్దిమంది నియంతపాలనకు తెరలేపి అప్రతిష్ట మాటగట్టుకొని చివరికి ప్రజల చేతిలో భంగపడి రాజకీయాల నుండి శాశ్వతంగా నిష్క్రమించిన నాయకులను కూడా చూ స్తున్నాం. ఇటీవలే రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్ని కల్లో పాత ప్రభుత్వంను ప్రజలు తిరస్కరించి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండునెలలు దగ్గర పడు తోంది. గత ప్రభుత్వ ఓటమికి కారణాలు ఎన్ని ఉన్నా ప్రస్తుత ప్రభుత్వ విజయానికి అవన్నీ సానుకూల అంశాలుగా పనిచేశాయి. వెరసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను కొత్త ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం అసం పూర్ణంగా ఉంచిన కొన్ని అంశాలను ఇప్పుడు చర్చిద్దాం.
విద్యా విధానం: తెలంగాణ విద్యా విధా నం దేశానికే రోల్‌ మోడల్‌ అని ఢంకా బజాయించిన గత ప్రభుత్వం పూర్తిగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. ప్రయివేటు విశ్వ విద్యాల యాల మీద వున్న శ్రద్ధ ప్రభు త్వ విద్యావిధానం మీద పెట్టలేకపోయింది. ఫలితంగా తెలంగాణలో విద్యావ్యవస్థ గాడి తప్పింది. ప్రాధమిక పాఠ శాల నుండి విశ్వ విద్యాలయాల వరకు బోధించేవారు లేక విద్యా సంస్థలు కూనరిల్లిపోయాయి. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సుమారు 8 వేలు ఉన్నట్లు అధికారుల అంచనా. అదే విధంగా బాలికలకు మూత్రశాలలు, మరుగు దొడ్లు లేని పాఠశాలలు అంటూ ఆ మధ్య కాలంలో పత్రి కలలో పతాక శీర్షికల్లో చదివాం. ఇటీవలే హైకోర్టు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బాలబాలికలకు మూత్రశా లలు, మరుగుదొడ్లు కట్టించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అంతెందుకు ఆదిలాబాద్‌, యదాద్రి భువ నగిరి జిల్లాలో నేటికి కొన్నిచోట్ల బడికి వెళ్ళాలంటే వాన కాలంలో వాగులు, పిల్లకాలువలు దాటుకుంటూ వెళ్తున్న పిల్లల్ని చూస్తూనే ఉన్నాం. ”గురువులేని విద్య రాణించదు” అన్న ట్లు, పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీల వరకు ఖాళీ గా వున్న అన్ని టీచర్‌ పోస్టులను తక్షణమే భర్తీచేసి విద్యార్ధు లకు నాణ్యమైన విద్యనందించాలి, ప్రయివేటు విద్యపై నిరం తరం నిఘా, నియంత్రణ, పర్యవేక్షణ చేయాలి. స్కాలర్షిప్‌లు, ఫీజు రీయం బర్స్‌మెంటు, హాజరు శాతం 75శాతం పైగా ఉన్న వారికే ఇవ్వాలి. లేని పక్షంలో నిధుల దుర్వినియోగం జరిగే ఆస్కారం వుంది. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి, తల్లిదండ్రులను ఆ దిశగా చైతన్యం చేయాలి. హాస్టళ్లలో కూడా మెరుగైన సదుపాయాలు రుచికరమైన భోజన సదుపాయాలు కల్పించాలి. ”ఉత్తమ విద్యావిధానం ఉన్నచోట, ఉత్తమ సమాజం నిర్మించబడుతుంది” అంటాడు అరిస్టాటిల్‌. అలాంటి సమాజ నిర్మాణానికి తరగతి గది కేంద్ర బిందువు కావాలి. ఉత్తమ విద్య ద్వారానే ఉపాధి కల్పన, సజనాత్మక ఆలోచనలు, విలువైన మానవవనరులు, ఉద్యోగావ కాశాలు మెరుగుపడతాయి. పక్కా ప్రణాళికతో కూడిన మంచి విద్యా విధానమే మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుందనేది గమనించాలి.
ఉద్యోగాల కల్పన, పథకాల సమీక్ష: గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా బిస్వాల్‌ కమిటీ రాష్ట్రంలో ఒక లక్ష తొంబై ఏడు వేల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని నివే దికను ఇచ్చినట్లు సాక్షాత్తూ గత ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వం దశలవారీగా వాటన్నింటిని భర్తీచేసి వివిధ శాఖల పనితీరును పటిష్టం చేయాలి. గ్రూప్‌1, గ్రూప్‌2, గ్రూప్‌3, గ్రూప్‌4, డిగ్రీ లెక్చరర్లు, జూనియర్‌ లెక్చరర్లు, పాలి టెక్నిక్‌ లెక్చరర్లు, టీచర్‌ పోస్టులు, ఇతర శాఖలకు సంబంధించిన అన్ని రకాల పోస్టులను తక్షణమే గుర్తించాలి. టీఎస్పీఎస్సీకి కొత్త ఛైర్మన్‌, సభ్యులనైతే నియ మించారు. కానీ గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోపభూయిష్టమైన ధరణి, రైతుబంధు, దళిత బంధు, బెల్టు షాపులు మొదలగు పథకాలు విచ్చలవిడిగా వున్నా మద్యం దుకాణాలను దశలవారిగా తగ్గించే ప్రయత్నం చేయాలి. ప్రజల్ని మందుబాబులుగానో, గంజా యి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి రెవిన్యూ రాబట్టుకోవాలనుకోవడం సమంజసం కాదు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభుత్వం కూడా సుస్థిరంగా ఉన్నట్లు భావించాలి. ప్రజలు ఇబ్బందులకు గురైతే ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తారు. కాబట్టి ప్రజలకు లేదా యువతను వారి స్వశక్తి మీద ఆధారపడి జీవించేలా ఉపాధి కల్పన కేంద్రాలు నెలకొల్పి శిక్షణనివ్వాలి.
అభివద్ధి, సంక్షేమం : ప్రాంతం ఏదైనా కావచ్చు, వ్యవసాయకంగా, పారిశ్రా మికంగా, వెనుకబడిన ప్రాంతాలైన ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌ మొదలైనవి, ఇతర జిల్లాలకు కూడ సమాన భాగస్వామ్యం కల్పించి, జాతీయ స్థాయి ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులు వచ్చే విధంగా కషిచేసి వెనుకబడ్డ ప్రాంతా లకు అభివద్ధిలో సమాన భాగస్వామ్యం కల్పించాలి. రోడ్డు, పాఠశాలలు, వైద్యశా లలు, పేదలకు ఇండ్లు, తాగునీరు, కరెం టు సదుపాయం కల్పిస్తే సహజం గానే ఆ ప్రాంతంలో మెరుగైన సౌకర్యాలు అందుతున్నట్లుగా భావించాల్సి వుంటుం ది. గత ప్రభుత్వం అభివద్ధి, సంక్షేమం కొంతమేరకు చేసినప్పటికి చాలా విష యాల్లో నిర్లక్షం ప్రదర్శించినందువల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆ లోటును భర్తీచేస్తూ అభివద్ధిలో సబ్బండ వర్గాలకు ప్రాతి నిధ్యం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లు కావస్తున్న సంద ర్భంగా ప్రాంతాల వారిగా చేయాల్సినవి పురోగతిలో ఉన్నవి, పూర్తిగా పెండింగ్‌ లో వున్నవి ఇలా విభజించుకుని ప్రాధాన్యతా రంగాలను బట్టి నిధులు కేటాయించి దశలవారిగా అభివద్ధి వైపు రాష్ట్రాన్ని మళ్లించాలి ఈ విషయంలో ప్రతిపక్షాల నిర్మాణాత్మకరమైన సూచనలు, సలహాలు స్వీకరించి అధికారపక్షం పాటించాలి, అమలు చేయడానికి కషిచేయాలి. ప్రతిపక్షాలంటే శత్రుపక్షం అన్న భావన అధికార పక్షం తొలగించుకోవాలి.
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు శ్రీకారం చు ట్టారు. అయితే మిగిలిన పథకాలకు ఎంతమంది అర్హులు, ఎంత ఖర్చు అవుతుంద నేది? రెవిన్యూ ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనేది అధికారికంగా అంచనాలు రూపొందించి దశలవారీగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. లేనిపక్షంలో గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలు చెల్లించడానికి రాష్ట్ర రెవిన్యూ ఆదాయం సగం పైగా వెళ్తుందని అధికారుల లెక్కలు తెలియజేస్తున్నారు. ఈ అపోహలపై పూర్తిగా ఒక సమగ్ర నివేదికను తయారు చేసి ప్రజలకందివ్వాలి. ”వ్యక్తి స్వేచ్చను పరిరక్షిం చేది ఉత్తమ ప్రభుత్వం ప్రజల హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పించి వారి లో రాజకీ య పరిజ్ఞానాన్ని పెంపొందిచుట ద్వారా సంపూర్ణ వికాసానికి తోడ్పడే ప్రభుత్వం ఉత్తమమయినదని” బ్రిటిష్‌ తత్త్వవేత్త జాన్‌ స్టువర్ట్‌ మిల్‌ అంటాడు. తెలంగాణ సమాజం ఎన్నో నిర్భంధాలను, బలిదానాలను, అవమానాలను భరించింది, ఇకముందు అలా జరుగకుండా ఇకనైనా ప్రజాకాంక్ష మేరకు కొత్త ప్రభుత్వం పాలన కొనసాగాలి.
– డా.మహ్మద్‌ హసన్‌, 9908059234

Spread the love