ఆదివాసుల స్ఫూర్తిప్రధాత ‘హైమన్‌ డార్ప్‌’

ఆదివాసుల స్ఫూర్తిప్రధాత 'హైమన్‌ డార్ప్‌'ఆదివాసులకు స్ఫూర్తి ప్రధాత, వెలుగుదివ్వె అయినటువంటి క్రిస్టఫర్‌ వాన్‌ ప్యూరర్‌ హైమన్‌ డార్ప్‌ వర్థంతి జనవరి 11. ఆదివాసులు ఆరాధ్య దైవంగా భావించే ఆయన వర్థంతిని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లో ఘనంగా నిర్వహించారు. ఎందుకంటే హైమన్‌ డార్ప్‌ ఆదివాసులపై జరిపిన అధ్యయనం, పరిశోధన అపారమైనవి. వారికి గుర్తింపు తెచ్చినవి. ఆదివాసుల ఉనికిని చాటిచెప్పినవి. దేశంలో బ్రిటిష్‌ వారికి వ్యతి రేకంగా తెలంగాణలో నిజాం పరిపాలన వారి చట్టా లు, న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జల్‌-జంగిల్‌-జ మీన్‌ (నీరు- అడవి-భూమి) భుక్తి కొరకు ఆదివాసుల హక్కులను కాలరాస్తూ నిజాం సైన్యం అగడానికి వ్యతి రేకంగా, అటవీ ఉత్పత్తుల పైన పన్నులు, ఏజెన్సీలో వలసలు, వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు, అటవీ ఆక్రమణదారుల నిర్బంధాలు, గ్రామ పట్వారిల మోసాలకు ఆదివాసు లు బలికావడం జరిగింది. తమ హక్కు లకై, ఆదివాసుల అస్తిత్వం, వారి సం స్కతి భాష పరిరక్షణకు 1940 సంవత్స రంలో కుమురం భీమ్‌ రాజ్‌గోండ్‌ ఆధ్వ ర్యంలో జోడేఘాట్‌ని కేంద్రంగా చేసు కొని నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా గెరిల్లా పద్ధతిలో తమ జాతి బిడ్డలను ఏకం చేసి ధర్మం కొరకై తిరుగుబాటు ఎగురవేసినాడు. ప్రభుత్వానికి వ్యతిరే కంగా ఆదివాసి జాతిని ఏకం చేసి పోరాడుతూ వారి లో చైతన్యవంతం చేశారు. ఇలాంటి సమయంలో ని జాం ప్రభుత్వం తన సైన్యం చేసిన దాడిలో ఎంతో మంది ఆదివాసి బిడ్డలు తుపాకీ తూటలకు బల య్యారు. తమ నెత్తురు అడవి తల్లికి సమర్పించి అసువులు బాసినారు.
ఇంతటి వ్యతిరేకతకి గల కారణాలు, వీరి అ శాంతికి మూలాలు ఏంటని నిజాం రాజు దృష్టిలో పెట్టుకొని దీని పరిష్కారానికి హైమన్‌ డార్ప్‌ను నిజాం ప్రభుత్వం సలహాదారులుగా సూచనల కొరకు నియ మించారు. తన భార్య అయినా ఎల్జిబియత్‌ బెర్ణల్డ్‌ బె ట్టిలు కూడా తనతో కలిసి ఆదివాసి అదిలాబాద్‌ అడ విలో పర్యటించారు. ఆదివాసుల భాష గోండి నేర్చు కుని వారితో మమేకమై సమస్యల్ని అన్వేషించారు. జనజీవనం, అటవీ జీవనం ఆర్థిక పరిస్థితులు, నిజాం అధికారుల తీరు నిజాం సైన్యం ఆగడాలకు, ఆదివా సులకు వ్యతిరేకంగా ఉన్నాయని భావించి వాటిని అ ధ్యయనం చేసి ఆదివాసీల, గిరిజనుల వారి సమస్యలు పరిష్కారానికి సంబంధించినటువంటి పరిష్కార మా ర్గాన్ని రిపోర్టు రూపంలో తయారుచేసి నిజాం రాజుకు అందించారు. కానీ నిజాం రాజు చాలా వరకు వాటిని అమలుపరచలేదు. ఇలాంటి సమయంలో తనకు ఆదివాసుల సంస్కృతి నచ్చడంతో వారితో మమేకమై ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా వాసులతో ఆదివాసుల సాంప్రదాయాలు, సంస్కృతి, భాష పండుగలు, వ్యవ సాయము, పంటలు, వైద్యము, ఆయుర్వేదము ఇతర విషయాల్ని పరిశోధించి అధ్యయనం చేశారు. ఆది వాసుల సమస్యలకి ఒక వేదిక ఉండాలని తలంచి తర తరాల నుండి వస్తున్నా కేస్లాపూర్‌లో గల నాగోబా జాతరలో ఆదివాసుల సమస్యలకై ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ సమస్యలను విన్నవించి సమస్య పరి ష్కారానికై ”ప్రజాదర్బార్‌” అనే సభను ఏర్పాటు చేసినాడు.
నాటి నుండి నేటి వరకు ఈ ప్రజా దర్బార్‌ నాగోబా జాతరలో కొనసాగుతూ వస్తున్నది. ఆదివా సుల సమస్యలపై పరిశోధన చేసి చాలా గ్రంథాల్ని అచ్చు వేయించాడు. అలాగే హైమన్‌ డార్ప్‌ నేపాల్‌ నుండి ఈశాన్య భారతదేశం మొదలుకొని తెలంగాణ లోని చెంచులు, ఆదివాసులు, కోయలు, రాజు గోండ్స్‌, కోలామ్స్‌, కోండరెడ్లు వారి జీవన విధానంపై పరిశో ధన చేసి అనేక పుస్తకాలను ముద్రించాడు. అలాగే ఆదివాసులతో మమేకమై వారి సమస్యల్ని పరిష్కారం తన సమస్యగా భావించి ఆదివాసుల్లో కలిసిపో యాడు. దేశంలోనే గిరిజన తెగల ఆర్థిక సామాజిక మార్పు గురించి పనిచేశారు. డాక్టర్‌ మైకల్‌ యార్క్‌లో కలిసి ఉమ్మడిగా అధ్యయనం చేశారు. ఇందులో గోం డులు వారి ఖర్మకాండాలు, పౌరాణిక కథ నాలు విషయాలలో మార్పులు బహుశాల్పం 35 సంవత్సరాలు గోండ్‌ సమాజం అబివృద్ధి తీరుతెన్నులు గుర్తించి క్షేత్ర పరిశోధన సాధ్యం కావడానికి వీరికి బ్రిటన్‌, సాంఘిక, సైన్స్‌ పరిశోధన కౌన్సిల్‌ వారి గ్రాంట్లు, లేనర్‌ హ్యూమ్‌ ట్రస్ట్‌ వారి నిధులు, లెన్నర్‌ గ్రేన్‌ ఫౌండేషన్‌ ఆంథోపాలజికల్‌ రీసెర్చ్‌ వారి నిధులు కూడా ఈయన పరిశోధనకు చాలా ఉపయోగకరమైనవి. హైమన్‌డార్ప్‌ ఆదివాసి గిరిజనుల పోడు వ్యవసాయం, అటవీ హక్కు లు, వ్యవసాయ భూముల కమతాలకి పట్టా లు ఇవ్వకపోవడం, సాగునీరు, తాగునీరు, వసతుల సౌకర్యాల గురించి, అటవి ఉత్పత్తులకు మార్కెట్‌ సౌక ర్యాల కల్పన, విద్యా, వైద్యం, వడ్డీ వ్యాపారస్తుల ఆగ డాలను, క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర రూపంతో ఒక రిపోర్ట్‌ తయారు చేసి నిజాం ప్రభుత్వానికి అందజే శారు. ఆదివాసుల మీద మమకారంతో తన కుమారు నికి ”లచ్చుపటేల్‌” అనే ఆదివాసి పేరు పెట్టుకున్నాడు. హైమన్‌డార్ప్‌ 1995వ సంవత్సరంలో తన 85 యేటా లండన్‌ నగరంలో చనిపోయారు. తన తండ్రి చివరి కోరికని మన్నించి పిల్లలు తన అస్థికలను తెలం గాణ రాష్ట్రంలోని మర్లవాయి గ్రామంలో కననం చేయాలని కోరడంతో తన కుమారులు అక్కడే చేశా రు. తాను నివసించిన ఇల్లు (గుడిసె) ఇప్పటికి అలాగే ఉంచి తన జ్ఞాపకార్థం గ్రామస్తులు కాపాడుకుంటు న్నారు. హైమన్‌డార్ప్‌ 1909వ సంవత్సరం జూన్‌ 11 న జన్మించారు. లండన్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఓరియం టల్‌, ఆఫ్రికన్‌ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తూనే తన సహా ఉద్యోగి అయినా ఎలిజియత్‌ బర్నాల్డో బెట్టిని (ఈమె 1911 బ్రిటన్‌లో జన్మించి 1987 జూన్‌ 11న హైదరాబాద్‌ నగరంలో మరణించారు) వివాహం చేసుకున్నారు. అయితే హైమన్‌డార్ప్‌ జన్మించింది జూన్‌11, ఎలిజియత్‌ చనిపోయింది జూన్‌11. వీరి ద్దరి జనన, మరణాలు ఒకే రోజు కావడంతో హైమన్‌ డార్ప్‌ వర్థంతి జనవరి 11ను పురస్కరించుకుని ప్రతి యేటా ఆదివాసులు సంస్మరణ సభను ఘనంగా నిర్వహిస్తున్నారు
మర్లవాయి గ్రామంతో గల అనుబంధం:
ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో తాను చేసినటు వం టి అధ్యయనానికి ముఖ్యంగా మార్లవాయిలోనే ఉం టూ తన అధ్యయనం కొనసాగించారు. మర్లవాయితో హైమన్‌ డార్ప్‌కు అనుబంధం ఉంది. మర్లవాయి గ్రామానికి హైమన్‌ డార్ప్‌ స్ఫూర్తిదాత. ఈ యన జ్ఞాప కార్థం ప్రతి సంవత్సరం వర్ధంతి, జయంతి జరుపు తున్నారు. ఆదివాసి గిరిజన ప్రాంతాల చారిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధికై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ వారు మర్లవాయిలో రూ.18 లక్షలతో స్మృతి వనం ఏర్పాటు చేసి దీంట్లో హైమన్‌ డార్ప్‌ దంపతుల జీవిత విశేషాలు, ఫొటోలు ఏర్పాటు చేశారు. ఆదివాసుల ప్ర ముఖమైనటువంటి గుస్సాడీ నృత్యం కోసం ప్రభుత్వం రూ.20 లక్షలతో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గ్రామంలోని రోడ్లకు హైమన్‌ డార్ప్‌ వీధి పేరు పెట్టారు. అలాగే బెట్టీ వీధి, హైమన్‌ డార్ప్‌ పేరుతో లైబ్రరీకి వారి నామకరణం చేశారు. వీరి వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఆటల పోటీ నిర్వహించి గెలు పొందిన వారికి బహుమతులు అందిస్తున్నారు. గ్రామంలోని యువజన సంఘానికి హైమన్‌ డార్ప్‌ యూత్‌ క్లబ్‌గా నామకరణం చేసి యువకులు సేవలం దిస్తున్నారు. గతేడాది మర్లవాయి గ్రామం ఉత్తమ గ్రా మ పంచాయతీగా ఎన్నికైంది. యువకులైన కనక ప్రతిభ వెంకటేష్‌ సర్పంచ్‌ కృషి ఫలితంగా గ్రామం సర్వాభివృద్ధిలో కొనసాగుతోంది. గ్రామానికి చెందిన కనకరాజుకి కేంద్ర ప్రభుత్వం గుస్సాడి నృత్యానికి గాను పద్మశ్రీ అవార్డు అందించినది.
హైమన్‌ డార్ప్‌ రచనలు :
1) టైబ్స్‌ ఆఫ్‌ ఇండియా ది స్టగుల్‌ ఫర్‌ సర్వేవల్‌ 1982
2) డి అబోరిజినల్‌ ట్రైబ్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌
3) ది నేకేడ్‌ నాగోస్‌ 1939
4)ది చెంచుస్‌ 1943
5)రెడ్డీస్‌ ఆఫ్‌ ది బైసల్‌ హిల్స్‌ 1945
6) ఇది రాజ్‌ గోండ్స్‌ ఆఫ్‌ అదిలాబాద్‌ 1948
7)పటానీలు, పొరుగువారు 1962
8)నీతులు మరియు మెరిట్‌ 1967
9)ది షేర్పాస్‌ ఆఫ్‌ నేపాల్‌ 1964
10) ది బాగోరియా భీల్‌ 1964
12)ది కోన్వాక్‌ నొగోస్‌ 1909
(ఇలా అనేకమైనటువంటి రచనలు చేసి వీటిని లండన్‌లో ముద్రణ వేయించారు)
(జనవరి 11హైమన్‌డార్ప్‌ దంపతుల స్మృతి దినం)
డా.తూము విజరు కుమార్‌
9492700653

Spread the love