‘న్యాయం’ అధికార దుర్వినియోగం కారాదు!

'న్యాయం' అధికార దుర్వినియోగం కారాదు!పెద్దనోట్ల ప్రవేశం, మధ్యలింగుల పెళ్ళి, క శ్మీర్‌ 370 అధికరణ రద్దు, అదానీ అవినీతి కేసులో సెబి విచారణ పొడిగింపు, హిండెన్‌బర్గ్‌పై చర్య వంటి తీర్పులతో సుప్రీంకోర్టుకు గ్రహ ణం పట్టిందనిపించింది. బిల్కిస్‌బానో కేసులో న్యాయమూర్తులు నాగరత్న, ఉ జ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం తీర్పుతో మహిళా న్యాయమూర్తుల విలక్షణత, సుప్రీంకోర్టు నమ్మకం మరోమారు వెలిశాయి.
బాబ్రి మసీదు కూల్చివేత దశాబ్ది వేడుకలకు వెళ్ళిన 2200 మంది కర సేవకులు అయోధ్య నుండి తిరిగొస్తూ 27 ఫిబ్రవరి 2002న గోధ్రాస్టేషన్లో ముస్లిం అంగళ్ళను ధ్వంసం చేశారు. ఒక వ్యక్తి కిరోసిన్‌ క్యాన్లతో ఎస్‌ 6 పెట్టె చివరి (72) సీట్లో కూర్చున్నాడు. స్టేషన్‌ శివార్లలో కిరోసిన్‌ కుమ్మరించి నిప్పుపెట్టి దూకేశాడు. 58 ప్ర యాణికుల శవాలను ముఖ్యమంత్రి మోడీ గోధ్రా నుంచి అహ్మదాబాద్‌ దాకా ఊరేగించారు. దారి పొడుగునా ఉద్రేక ఉపన్యాసాలతో రెచ్చగొట్టారు. నరమేధాన్ని ప్రోత్సహించారు. మంత్రులు, పోలీ సులు, అధికారులు అల్లర్లను నిర్దేశించారు. గుజ రాత్‌ ముస్లింలపై మూడు నెలలు కాష్టం కాలిం ది. 2,500 మంది చనిపోయారు. 223 మంది కనిపించ లేదు. రూ.వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. చారిత్రక సమాధులు, మసీదులు, లక్ష ఇండ్లు, 1100 హోటళ్లు, 15వేల వాణిజ్య సంస్థ లు, 3వేల తోపుడు బండ్లు, 5వేల వాహనాలు, 274 దర్గాలు, 241 మసీదులు, 19 గుళ్లు, 3 చర్చీలు ధ్వంసమయ్యాయి. ఈ విధ్వంసంలో సం ఫ్‌ు సంస్థలన్నీ పాల్గొన్నాయి. హిందు స్త్రీలు ము స్లిం అంగళ్లను దోచుకున్నారు. 1.5 లక్ష మంది ఊ ర్లొదిలారు. 250 మంది బాలికలపై సామూహి క అత్యాచారం చేసి, కాల్చారు. గర్భవతుల కడుపు లు కోసి పిండాలను, తల్లులను చంపేశారు. విద్యు ద్ఘాతంతో ఇళ్ళలో వారిని కాల్చారు. స్త్రీలపై యాసి డ్‌ పోశారు. మర్మాంగాల్లో వస్తువులు దూర్చారు. వక్షోజాలు కోశారు. కేంద్రంలో బీజేపీ అధికారానికి రాగానే నిఘా విభాగాలు, దర్యాప్తు సంస్థలపై ఒత్తిడితో తారుమారు నిర్ణయాలు చేయించారు. 2014 డిసెంబర్లో సిబిఐ స్పెషల్‌ కోర్టు అమిత్‌ షా, మోడీలను వదిలేసింది.
దాడుల నుంచి తప్పించుకోడానికి 3 మార్చి 2002 న అహ్మదాబాద్‌ దగ్గరిరంధిక్‌ పుర్‌ గ్రామం నుండి పారిపోతున్న వారిలో ఐదునెలల గర్భవతి, 19ఏండ్ల బిల్కిస్‌బానో ఉన్నారు. గర్భవతినని చె ప్పినా 20మంది హిందుమత ఉగ్రవాదులు ఆమె ను సామూహిక అత్యాచారం చేశారు. ఆమె మూ డేళ్ళ బిడ్డను నేలకు బాది చంపారు. 14 మంది బానో కుటుంబసభ్యులను చంపేశారు. నలుగురు బానో బంధువులను, తల్లి, చెల్లిని సామూహిక అత్యాచారం చేసి చంపారు. బతికిన ఆమె భర్త, బా నో సంఘీయులకు భయపడి బాలింత పిల్లిలా 20 ఊర్లు మారారు. మానవ హక్కుల సంఘం కార్య కర్తలు బానోకు బాసటగా నిలిచారు. మోడీ అధీన గుజరాత్‌, కేంద్ర ప్రభుత్వాలు ఈ మద్దతుదార్లపై కక్ష, ప్రతీకార చర్యలకు పాల్పడ్డాయి. గుజరాత్‌లో న్యాయం జరగదని విచారణను ముంబయికి మా ర్పించుకున్నారు బానో. ముంబాయి ట్రయల్‌ కోర్టు 2008 లో 8 మంది నిందితులను నిర్దోషులుగా వదిలేసింది. ఒక ము ద్దాయి విచారణ సమయంలోనే చనిపోయాడు. 11 మందికి జీవితఖైదు విధించింది. 2017లో బాంబే హైకోర్టు ఈ శిక్షను ధవీకరించింది. న్యాయమూర్తి ఆర్‌. భానుమతి రాసిన బానో కేసు 23 ఏప్రిల్‌2019 సుప్రీంకోర్టు తీర్పులో మాతృ హృదయం ద్రవించింది. బానోకు రూ.50 లక్షల పరిహారం, ఇల్లు, ఉద్యోగం ఇమ్మని కోర్టు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనేక అర్జీల తర్వాత గుజరాత్‌ ప్రభు త్వం బానోకు డబ్బు ఇచ్చింది. ఇతర పరిహారాలు ఇవ్వలేదు. మైనారిటీల మారణహోమం హిట్లర్‌ నీతి. ఇదే గుజరాత్‌ నమూనా. మెజారిటీ మతస్తుల సమీకరణ, ఓటు బ్యాంకుగా మార్చు సంఫ్‌ు పాలకుల లక్ష్యాలు.
బిల్కిస్‌ బానో కేసులో ముద్దాయి రాధేశ్యామ్‌ భగవాన్‌ దాస్‌ షా తనను ముందుగా వదిలిపెట్ట మని అడిగారు. ఈ అభ్యర్థనను విచారించమని మహారాష్ట్ర గృహ మంత్రిత్వ శాఖ సిబిఐని, సిబిఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. జనవరి 2020 లో అవి ఈషా అభ్యర్థనను తోసిపుచ్చాయి. అయితే (నేటి విశ్రాంత) న్యాయమూర్తి అజరు రస్తోగి సు ప్రీంకోర్టు ధర్మాసనం, సుప్రీంకోర్టు 2014 తీర్పుకు వ్యతిరేకంగా, షా అభ్యర్థనను పరిశీలించమని గుజరాత్‌ ప్రభుత్వాన్ని కోరింది. రద్దయిన 1992 గుజరాత్‌ ప్రభుత్వ ఉపశమన నియమాల ప్రకారం 11 మంది ముద్దాయిలను సత్ప్రవర్తన కారణంతో విడిచిపెట్టమని 10 ఆగష్టు 2022న గుజరాత్‌ ప్రభుత్వం సిఫారసు చేసింది. శిక్షాకాలంలో ఈ ముద్దాయిలు పెరోల్‌ కింద బయటే తిరిగారు. గుజరాత్‌ ప్రభుత్వ సిఫారసుతో 75 ఏళ్ల భారత స్వాతంత్య్ర అమృతకాల కానుకగా 15ఆగష్టు 2022 న వారిని వదిలేశారు. ముద్దాయిలను బీజేపీ నా యకులు సత్కరించారు. విజయోత్స వాలు జరిపారు. సుసంస్కార బ్రాహ్మణులయిన ఈ 11 మంది నేరం చేసేవారుకాదని కితాబి చ్చారు. 2014 సు ప్రీంకోర్టు ఉపశమన విధానం ఇద్దరి కంటే ఎక్కువ మందిని చంపిన, సామూ హిక అత్యాచార హత్యల ముద్దాయిలకు ఉపశమ నాన్ని నిషేధించింది. ఉపశమనానికి కనీస శిక్షా కాలాన్ని 14 ఏళ్ల నుండి 28 ఏళ్ళకు పెంచింది. జీవితఖైదీల విడుదలను విడిగా పరిగణించాలి. గంపగుత్తగా తీసుకోరాదు. ఇక్కడ షా అభ్యర్థన ఫలితంతో మొత్తం 11 మందిని వదిలారు. ముద్దాయిల మానవత్వ దృక్పథం, రాజ్యాంగం, చట్టాలకు లోబడిన ప్రవర్తన, సామాజిక కట్టుబాట్ల పాటింపు, సంస్కరణ ఉపశమన విధానానికి హేతుబద్ద కొలమానాలు. హత్యలు, మాన భంగాలు అమానవీయాలు. ఉపశమనానికి అన ర్హాలు. ఈ 11 మంది ముద్దాయిలలో ఈ లక్షణా లేవీ లేవు. విడుదల తర్వాత పాత అలవాట్లను, పద్దతులను పాటిస్తూ బీజేపీ ఎన్నికల ప్రచారం చేశారు.
ప్రజలను అవమానించిన, పౌరులు నిరసిం చిన ముద్దాయిల విడుదలను ప్రశ్నిస్తూ బిల్కిస్‌ బానో తిరిగి సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ కెప్టెన్‌ కీ.శే. లక్ష్మి సెహగల్‌ కుమార్తె సుభాషిణి అలీ, లఖ్నొ విశ్వవిద్యాలయ పూర్వ కులపతి ఆచార్య రూపరేఖా వర్మ, పాత్రి కేయురాలు రేవతిలాల్‌, పార్లమెంటు సభ్యురాలు మ హువా మొయిత్ర ఈ కేసులో ప్రజా ప్రయో జన వ్యాజ్యాలు వేశారు. 8 జనవరి 2024 న న్యా యమూర్తులు నాగరత్న, ఉజ్జల భూయాన్‌ల సు ప్రీంకోర్టు ధర్మాసనం అత్యాచార హంతక ముద్దా యిలను విడిపించిన గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయా న్ని తప్పుపట్టింది. రెండు వారాల్లో 11మంది ము ద్దాయిలు జైలు అధికారులకు లొంగిపోవాలని ఆదేశించింది. శిక్షపడింది ముంబై హైకోర్టులో. మ హారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ కేసులో సిఫా రసు చేసే అవకాశం ఉంటుంది కాని గుజరాత్‌ ప్రభుత్వానికి లేదంది. ఈ తీర్పును రాసిన న్యాయ మూర్తి నాగరత్న న్యాయ విచక్షణ, మహిళా సమా నత దక్పథం మరోమారు ప్రపంచానికి తెలిశాయి.
ముద్దాయిలు మరలా మహారాష్ట్ర ప్రభుత్వ త లుపు తట్టవచ్చు. బీజేపీ ఆధీన మహారాష్ట్ర ప్రభు త్వం తమ పాత నిర్ణయానికి కట్టుబడుతుందా? 2014 ఉపశమన నియమాలతో మానవత్వాన్ని ప్రదర్శిస్తుందా, న్యాయవ్యవస్థ నమ్మకాన్ని పెంచు తుందా?అన్నీ అనుమానాలే. బానోతో సహా మాన వహక్కుల కార్యకర్తల ఆనందం ఆవిరికావచ్చు. అధికారం దుర్వినియోగం కారాదు. దోపిడీ, ఆక్ర మణ, అన్యాయం, ఆశ్రిత పక్షపాతాలకు పాల్పడ రాదు. కొందరు మతస్తులను ఇతరులుగా చూడ రాదు. ప్రభుత్వాల లక్ష్యం ప్రజా శ్రేయస్సు, రాజ్యాం గ ఆచరణ. కోర్టులపరిధి రాజ్యాంగం. ఇవి రెండు పౌరులలో క్రమశిక్షణ, మానవత్వం నింపాలి.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
949020 4545

Spread the love