ప్రజా ప్రభుత్వంలోనైనా పాఠశాల విద్య బాగుపడుతుందా?

Can schooling improve under a public government?తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పాత ప్రభుత్వం పనితీరును సమీక్షించడం శుభపరిమాణం. సమీక్షించా ల్సిన అతి ముఖ్యమైన అంశాల్లో పాఠశాల విద్యాశాఖ ఒకటి. ఎందు కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం అత్యంత నిర్లక్ష్యానికి గురై 50శాతం పాఠశాలలు మూసివేత అంచున నిలబడి ఉన్నాయి. బడి బాట, బడి పిలుస్తోంది రా, జయశంకర్‌ బడిబాట వంటి వాటి ద్వారా పిల్లలను బడులలో చేర్పించే కార్యక్రమాలు అదేం విచిత్రమోగాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు లేదా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పడిపోవడం ప్రారంభమైంది. పైకి చూడడా నికి గత ప్రభుత్వం రెసిడెన్షియల్‌ పాఠశాలల సంఖ్యను భారీగా పెంచినట్టు కనబడడం మంచిదే అయినా వాటిలో చేరిన విద్యార్థులలో 90శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నవారే కావడం గమనర్హం. ఒక ప్రభుత్వ వ్యవస్థను కుప్పకూల్చి మరొక ప్రభుత్వ వ్యవస్థను నిర్మించడం నిర్మాణాత్మక అభివృద్ధి ఎలా అవుతుంది? ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యారంగంలో పనిచేస్తున్న మేధావులు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి రెసిడెన్షియల్స్‌గా మార్చాలని డిమాండ్‌ చేస్తే దానికి బదులుగా కొత్త వ్యవస్థను తీసుకొచ్చి ఉన్న వ్యవస్థను నాశనం చేసారు. అలా కాకుండా ప్రభుత్వ పాఠశాలలనే రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా మార్చి ఆ ఖర్చంతా వీటి వసతుల కల్పనకు పెట్టిఉంటే ప్రతి మండలంలోని బడులన్ని బాగుపడేవి, భూమితో పాటు, బోలెడంత డబ్బు ఆదా అయ్యేది. ముప్పై ఏళ్ళ క్రితమే ప్రయివేటులో నర్సరీ, ఎల్‌.కె.జి., యు.కె.జి లాంటి ప్రీ ప్రైమరీ విద్యకు అనుమతిని ఇచ్చి, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీని ప్రారంభించకుండా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు తప్పుచేస్తే, కె.జి టు పి.జి అనే అందమైన అబద్దపు నినాదాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం కె.జిని ప్రారంభించలేదు సరికదా పి.జిని సంస్కరించకుండానే ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు అనుమతిని ఇచ్చి అదే తప్పుచేసారు. ముప్పై ఏళ్ళ క్రితమే అడ్మిషన్‌ వయస్సును ప్రయివేటులో మూడేండ్లకు తగ్గిం చిన విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో నేటికి ఐదేండ్లకు పైగా కొనసాగిస్తున్నది. నర్సరీలో ప్రయివేటుకు వెల్లినవాడు ఒకటో తరగతికి ప్రభుత్వ పాఠశాలకు ఎలా వస్తాడు? ఐ.ఐ.టి, మెడికల్‌ లాంటి ఎంట్రెన్స్‌ పరీక్షలను ఎదుర్కొనే విధంగా ఇ-టెక్నో, కాన్సెప్ట్‌, ఒలంపియాడ్‌ స్కూల్స్‌, కళాశాలలు ప్రభుత్వ రంగంలో ప్రతిభావం తులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నా నేటికి ఎందుకు ప్రారం భం కాలేదు? ఒకవేళ ఇవన్ని జరిగి ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఈ దుర్భర స్థితికి వచ్చి ఉండేవి కావు. కొత్త ఉద్యోగాలు సష్టించబడి చాలామంది నిరుద్యోగులకు అతిపెద్ద ఉపాధి కేంద్రంగా విద్యా వ్యవస్థ ఉండేది.
పాఠ్యపుస్తకాలలో, బోధనలో ఎటువంటి ప్రయోగాలు లేకుండా ప్రయివేటు పాఠశాలలు అద్భుతంగా పరిఢవిల్లుతుంటే, మెరుగైన ఫలితాలు సాధిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాల పాడు కాలం ఎందుకు నడుస్తున్నది? ఎపెప్‌, డిపెప్‌, క్యూఐపి, ఎల్‌.ఇ,పి, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సి.సి.ఇ), నిష్ఠ లాంటి ప్రయో గాలన్ని కూడా ప్రపంచ బ్యాంక్‌ కుట్రలో పావులుగా మారిన కొంత మంది వాళ్ళ పదవులు, డిప్యూటేషన్లు పదికాలాలపాటు కాపాడుకునే సూడో మేధావుల సష్టి. సంవత్సరానికో ప్రయోగం. ఏ ప్రయోగం ఏం ఫలితం సాధించిందో ఇప్పటికి బహిరంగపరచలేదు! వీటి వల్ల ప్రజల్లో పాఠశాల విద్యావ్యవస్థ పట్ల ఉండే విశ్వాసం దెబ్బతినడమే కాదు విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఈ మధ్య కాలంలో జరిగిన సర్వేలన్ని పిల్లలకు చదవడం, రాయడం రావడం లేదని చెబుతుంటే ఎ.సి గదుల్లో కూర్చోన్న మేధావులు మాత్రం ఉపాధ్యాయుడు పాఠాలు ఎలా బోధించాలో శిక్షణల పేరుతో శిక్ష విధిస్తూ ఎఫ్‌.ఎల్‌.ఎన్‌, ఉన్నతి లాంటి కొత్త ప్రయోగాలను వద్దో మొర్రో అని మొత్తుకున్న, మమ్మల్ని పాఠాలు చెప్పనివ్వండని అరిచి గీపెట్టిన బలవంతంగా రుద్దుతున్నారు. ఏకోపాధ్యాయుడు లేదా ఇద్ద రు ఉపాధ్యాయులు ఎఫ్‌.ఎల్‌.ఎన్‌ను ప్రాథమిక స్థాయిలో 5 తరగ తులకు ఎలా అమలు చేయగలరు? ఉపాధ్యాయులు తరగతి గదు ల్లో బోధించాల్సిన సోపానాలను బట్టి పట్టా లి. వాటిని అడగటానికి, వాటి ప్రకారం బోధి స్తున్నారా లేదా పరిశీలించడానికి వందల మంది ఉపాధ్యాయులను వాళ్ళు పనిచేసే బ డులను నాశనంచేసి డిప్యూటేషన్లు పెట్టి, తనిఖీ బృందాలను ఏర్ప రిచి వారి సమాన క్యాడర్‌కు చెందిన సహచర ఉపాధ్యాయుల తర గతి గదుల్లో కూర్చొని పరిశీలించమనడం ఎంత సిగ్గుచేటు! ఎం.ఇ. ఓ, డిప్యూటీ ఇ.ఓ లాంటి పర్యవేక్షక పోస్టులు ఎందుకు నింపరు? విద్యార్థే అన్ని అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఉపాధ్యాయుడు ఏం బోధించకూడదట! అక్షరాల నుండి పదాలు, వాక్యాలు నేర్చుకోవడా నికి బదులుగా వాక్యాల నుండే అక్షరాలు నేర్చుకోవాలని పుస్తక రచయితలుగా అవతారమెత్తిన ఉపాధ్యాయులు సెలవిచ్చి ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాలు రాయడం వల్ల ప్రభుత్వ విద్యార్థులు చదువు రాకుండా అయితే, అసర్‌తో అధ్యయనం చేయించి విద్యార్థికి చదువు రావడం లేదని ఉపాధ్యాయుడిని దోషిగా చూపి ప్రభుత్వ పాఠశాల లను బదనాం చేసి మూసివేత కుట్రకు తెరలేపి ప్రయివేటుకు దారు లు వేయడం ఎంత పెద్దకళో కదా! మార్చిలో అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థిని జూన్‌లో పైతరగతి ప్రమోట్‌ చేయడం ఏవిధంగా కరెక్ట్‌! కనీస స్థాయికి చేరుకోనివారిని డిటెన్షన్‌ ఎందుకు చేయరు? సి.సి. ఇని ప్రవేశపెట్టిన సి.బి.ఎస్‌.ఇ, 21 రాష్ట్రాలు దాని దుష్ఫలితాలను సమీక్షించుకొని, వెంటనే రద్దు చేసుకొని పాత పద్ధతిని ప్రవేశ పెట్టుకుంటే, మన రాష్ట్రంలో మాత్రం ఇది తప్పుడు విధానమని ఉపాధ్యాయులు, సంఘాలు, తల్లిదండ్రులు చెప్పి రద్దుచేయాలని డి మాండ్‌ చేసినా ప్రభుత్వం పెడచెవినపెట్టింది. విద్యార్థికైతే రోజు పరీ క్షలే! పరీక్షలేని రోజంటు ఉండదు. విద్యార్థులపై పెరిగిన పరీక్షల భా రాన్ని తగ్గించి సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టి బోధనకు, చదవ డానికి, రాయడానికి విద్యార్థికి అధిక సమయం కేటాయించడానికి చర్యలు తీసుకోవడానికి బదులుగా విద్యాశాఖ, ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిలో రిటైరైనా మేధావులు దానిని వదిలి పెట్టడకుండా కేవలం తమ పదవులను కాపాడుకోవడానికి తిష్టవేసుకొని గబ్బిలాల్ల వేలాడుతూ శిక్షణల మంత్రాగాన్ని నడుపుతూ విద్యావ్యవస్థను పగబట్టి సర్వ నాశనం చేసి పతనం అంచుకు తీసుకువచ్చారు.
మన ఊరు, మన బడి మంచి పథకమే అయినా చెరువులో నీళ్ళు చెరువెనుకబడ్డ తర్వాత ప్రారంభించబడిందనే అపవాదుతో పాటు కొన్ని పాఠశాలల్లోనే అది ప్రారంభమైంది. వేల కోట్ల రూపా యలతో పాఠశాలల్లో కంప్యూటర్లతో గదులను నెలకొల్పి, ఉన్న బోధకున్ని తీసేసి వాటిని మూలకుబడేసి విద్యార్థులను గ్లోబల్‌సిటి జన్‌ తయారు చేయాలనే పీడకల కంటున్న అధికారులు, ప్రభుత్వం ఉన్నకాలం ఇది! ప్రయివేటులో కంప్యూటర్లపై పిల్లలు ఆటలాడు తుంటే మన ఘనత వహించిన విద్యాశాఖ పనికిమాలిన శిక్షణలు ఇస్తూ పరువు తీసుకుంటుంది. సమావేశాలపై సమావేశాలు, నివేది కలపై నివేదికలు, రిపోర్టులపై రిపోర్టులు కంప్యూటర్‌ యుగంలో కూడా అడిగిన వాటినే అడగటం లాంటివన్ని కేవలం ఉపాధ్యా యున్ని తరగతి గదికి దూరంచేసే కుట్రలో భాగమే! 98శాతం పాఠ శాలలు అటెండర్‌, స్వీపర్‌, స్కావేంజర్‌, క్లర్క్‌ లేకుండా ఉపాధ్యా యులే ఆ విధులు నిర్వహిస్తూ కాలం వెల్లదీస్తూంటే తనిఖీల పేరుతో అధికారులు, నాయకులు మరుగుదొడ్లు, మధ్యాహ్నభోజనం బాగాలే వని సస్పెండ్‌ చేయడం ఎంత దౌర్భాగ్యం! రైతులకు, పేదలకు ఉచిత కరెంట్‌ ఇచ్చే పాలకులకు బడులకు ఉచిత కరెంట్‌ ఇవ్వాలని ఎందుకు గుర్తుకురాదో అర్థంకాదు! పాఠశాలలకు ఇచ్చే నిధులు విద్యుత్‌ బిల్లుకే సరిపోవు. లైబ్రరీలు, ల్యాబ్‌లు అటుంచి 50 శాతం పాఠశాలల్లో నేటికీ టాయిలెట్‌ లాంటి కనీస మౌలిక వసతుల కల్పన కూడా జరుగపోవడం చాలా దురదష్టకరం.
గత ప్రభుత్వంలా కాకుండా ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం అడ్మిషన్‌ వయస్సు మూడేండ్లకు తగ్గించడంతో పాటుగా, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌.కె.జి, యు.కె.జి లను ప్రవేశపెట్టడంతోపాటు ప్రాథమిక పాఠశాలలను సెమిరెసిడె న్షియల్స్‌గా, హైస్కూల్స్‌ అన్నింటిని రెసిడెన్షియల్స్‌గా మార్చాలి. ఈ ప్రయోగాలను, శిక్షణలను ఆపి, అన్ని రాష్ట్రాల్లాగే సి.సి.ఇని రద్దు చేసి, సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఒక పాఠశాలను ఒక యూ నిట్‌గా తీసుకొని మౌలిక వసతులతోపాటు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించి కంప్యూటర్‌ విద్య ప్రాధాన్యతను పెంచడంతోపాటు లైబ్రరీ లు, కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌లు నెలకొల్పాలి. తరగతి గదికో ఉపా ధ్యాయున్ని నియమించాలి. మండల విద్యాధికారి కార్యాలయాలతో పాటు ప్రతి పాఠశాలకు స్కావెంజర్‌, అటెండర్‌, క్లర్క్‌ను నియమిం చాలి. ఇంచార్జ్‌ల వ్యవస్థను రద్దు చేసి అన్ని స్థాయిల్లో పర్యవేక్షక పోస్టులను నింపాలి. డిప్యూటేషన్లను రద్దు చేసి, విద్యా శాఖను భ్రష్టు పట్టిస్తున్న రిటైర్డ్‌ మేధావులను తొలగించాలి. ఇకనైన ఉపాధ్యా యులు, మేధావులు, ప్రజలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కళ్ళు తెరిచి గ్లోబలైజేషన్‌ విసిరిన సవాల్‌కు తగ్గట్టుగా పాఠశా లలను సంస్కరించాలనే డిమాండ్‌ను ప్రభుత్వాల ముందు ఉంచాలి. అందుకు తగ్గట్టుగా పౌరులను తయారు చేస్తామని హామీ ఇస్తే తప్ప ప్రభుత్వ పాఠశాలలను ప్రజలు విశ్వసించరు. గత ప్రభుత్వం విస్మరించినపై అంశాలన్నింటిపై సమీక్షించి పతనం అంచున నిలబడి ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటిని ప్రజా ప్రభుత్వం కాపాడుకోవడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది.
– డా. ఏరుకొండ నరసింహుడు, 9701007666

Spread the love