ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ-మహదేవ్పూర్
మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్బాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. తొలుతగా మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ర్యాలీ గా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని తెలంగాణ తల్లి సోని యాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణా ఏర్పడి పదవ సంవ త్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మంథని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.