ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

Rudrangiనవతెలంగాణ-రుద్రంగి
రుద్రంగి మండల కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను రుద్రంగి మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యదర్శి చేలుకల తిరుపతి మాట్లాడుతూ…తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ 78వ పుట్టిన రోజును రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకున్నామని, వారి అడుగుజాడల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణాన్ని ప్రజలు తీర్చుకున్నారని ఆమె జన్మదినన్ని పురస్కరించుకొని ఆరు గ్యారెంటీ లైన మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు.మహిళలు ఇట్టి ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించు కోవాలన్నారు.రాబోయే రోజుల్లో మిగతా గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తుం జలపతి,నాయకులు గడ్డం శ్రీనివాస్ ఎర్రం గంగ నరసయ్య,తర్రే లింగం,గండి నారాయణ,సూర యాదయ్య,మాడిశెట్టి అభిలాష్,పల్లి గంగాధర్,దయ్యాల శ్రీనివాస్,అల్లూరి రాజారెడ్డి,స్వర్గం పరంధాములు,ఆకుల గగన్,చేలుకల శ్రీకాంత్,ఆకుల గంగారం,సాయి మల్లయ్య, నంద్యాడపు మల్లేశం,ఎర్రం శ్రీనివాస్, అక్కెనపల్లి నర్సయ్య,బొండ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love