ముగిసిన ప్రచారం.. ప్రజలకు సోనియా గాంధీ కీలక విజ్ఞప్తి

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆరవ దశ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. మే 25న ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది.ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి వీడియో సందేశంలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో వీడియో సందేశంలో ఆమె మాట్లాడుతూ.. ” మీ ప్రతీ ఓటు ఉపాధిని సృష్టిస్తుంది. ద్రవ్యోల్భణాన్ని తగ్గిస్తుంది. మహిళలకు సాధికారతను కల్పిస్తుంది” అని ఆమె తెలిపారు. ఇవి అత్యంత కీలమైన ఎన్నికలని, ఈ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలని అన్నారు. లోక్ సభ ఎన్నికలలో ఢిల్లీ ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని ఆమె కోరారు. మీ ఓటు సమానత్వంతో కూడిన భారతదేశాన్ని సృష్టిస్తుంది” అని ఆమె అన్నారు. కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి అభ్యర్థుల్ని భారీ ఓట్లతో గెలిపించాలని ఇండియా కూటమికి ఓటేయాలని ప్రజల్ని సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు.కాగా, ఢిల్లీలో 7 నియోజకవర్గాల్లో గత రెండు సార్లు బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ మరియు నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తుండగా,మిగిలిన 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది.

Spread the love