సీబీఐ విచారణకు ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ డుమ్మా!

న‌వ‌తెలంగాణ‌- న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్‌ కేసులో సీబీఐ విచారణకు అఖిలేశ్‌ యాదవ్‌ డుమ్మా కొట్టనున్నారు. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో సాక్షమిచ్చేందుకు నేడు ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ యూపీ మాజీ ముఖ్యమంత్రికి సీబీఐ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. నేడు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. అయితే అఖిలేశ్‌ విచారణకు హాజరుకావడం లేదని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Spread the love