ఈడీ అరెస్ట్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం విచారణ

నవతెలంగాణ -ఢిల్లీ: జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది. భూ ఆక్రమణ కేసులో ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు. అంతకుముందు జార్ఖండ్ హైకోర్టులో హేమంత్ సోరెన్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ గురువారం ఉదయం 10.30 గంటలకు విచారించాల్సి ఉంది. అంతలోనే పిటిషన్‌ను హేమంత్ సోరెన్ వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి గురువారం నాడు హేమంత్ సోరెన్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింగ్వీ తీసుకెళ్లారు. దాంతో సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసిన అంశంపై ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Spread the love