జీపీ కార్మికుల సమ్మెకు శ్రీవాణి పూర్తి మద్దతు 

నవతెలంగాణ – ఆళ్ళపల్లి : ఆళ్ళపల్లి మండల కేంద్రములో గత 32 రోజులుగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె వద్దకు కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆశావహురాలు, కరకగూడెం గ్రామ సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి ఆదివారం చేరుకుని పూర్తి మద్దతు తెలిపి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామ నర్సయ్య, నాయకులు పి.నాగేష్, తదితరులు, ఆళ్ళపల్లి పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరమ ప్రభుదాస్, మల్కపురి శేఖర్, చంద్రబాబు, చలపతి, నర్సయ్య, ముసలయ్య, ఏలియా, తదితరులు పాల్గొన్నారు.
Spread the love