నిలిచిన నీరు..వాహనదారుల అవస్థలు..

– అర్ధాంతరంగా నిలిచిన రోడ్డు నిర్మాణ పనులు..
– అధ్వానంగా బేగంపేట ప్రధాన రోడ్డు..
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రం నుండి బేగంపేట వెళ్లే ప్రధాన రోడ్డుపై గుంతలమయమై నీరు నిలిచి అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు.శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. చిన్నపాటి వర్షానికే రోడ్డుపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు ప్రమాదపుటంచున ప్రయాణం చేస్తున్నారు. సంబంధిత గుత్తేదారు అర్థాంతరంగా రోడ్డు పనులు నిలిపివేయడంతో వాహనదారులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లాధికారులు చిత్తశుద్ధితో అర్ధాంతరంగా నిలిచిన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Spread the love