లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాల నేపథ్యంలో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ ఉదయం 70,165.49 పాయింట్ల వద్ద మొదలైంది. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరి సెషన్‌లో సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 70,000.60 పాయింట్ల కనిష్ఠానికి చేరగా.. గరిష్ఠంగా 71,149.61 పాయింట్లకు పెరిగింది. చివరకు 689.76 పాయింట్లు పెరిగి 71,060.31 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 215.20 పాయింట్లు పెరిగి 21,454 వద్ద ముగిసింది.

Spread the love