- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ నియోజకవర్గ ఎంఈఓలతో తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బడుల అవసరాలను, 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు, ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం మద్నూర్ మండల విద్యాధికారి రాములుతో పాటు మిగతా మండలాల విద్యాధికారులు శాలువాతో ఎమ్మెల్యేను సన్మానించారు.
- Advertisement -



