నవతెలంగాణ-అంబర్పేట
హిమాయత్నగర్లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ నిర్వహించే నెల రోజుల ఐదు వారాల వేసవి శిబిరం శుక్రవారంతో ముగిసింది. గ్రేడ్ నర్సరీ నుంచి 6వ తరగతి విద్యార్థులు యోగా, జిమ్నాస్టిక్స్, డ్యాన్స్, సంగీతం, తోలు బొమ్మలాట వంటి అనేక కార్యకలాపాలను నేర్చుకున్నారు. కళ, క్రాఫ్ట్, అవుట్డోర్, ఇండోర్ గేమ్లు, పిల్లలు ఉత్సా హంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మానికి కరస్పాండెంట్ కట్ట ప్రభాకర్, ప్రిన్సిపాల్ సీబీ ఎస్ఈ ప్రిన్సిపాల్ రామాంజుల, ఫాతిమా కాజిమ్, ట్రాన్స్ పోర్ట్ మేనేజర్ బాలారాజ్, తదితరులు పాల్గొన్నారు. పాఠ్యా ంశాల్లో అంతర్భాగంగా లలిత కళలను ప్రోత్సహించడంలో పాఠశాల చేస్తున్న కృషిని కరస్పాండెంట్ అభినందించారు. విద్యార్థులు తమ ఆసక్తితో కూడిన ఆటను గుర్తించి అందు లో నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సిబ్బంది, విద్యార్థులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శించినందుకు యాజమాన్యం ధన్యవాదా లు తెలిపింది. విద్యార్థుల ప్రయత్నాలను అభినందించారు. ఈ ఏడాది కొన్ని అద్భుతమైన క్రీడా ఈవెంట్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. నేర్చుకుని తమ పనితీరును మెరుగుపరచుకోవడంలో నిబద్ధత, అంకి తభావం ప్రదర్శించిన విద్యార్థులకు జ్ఞాపికలను అంద జేశారు. పొలాల్లో ఉండటం, స్నేహితులను కలవడం, యో గాభ్యాసం చేయడం, వారి ఫిట్నెస్పై పని చేయడం, పైగా అందులో భాగమవ్వడం వాటిపై ఉత్సాహంగా ఉన్నారు.