ఉప్పల్ లో సన్ రైజర్స్ మ్యాచ్… ట్రాఫిక్ ఆంక్షలు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనిపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరాలు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. హెచ్ఎండీఏ లే అవుట్ నుంచి బోడుప్పల్, చెంగిచెర్ల క్రాస్ రోడ్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను భగాయత్ రోడ్డుపై మళ్లిస్తారు. వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

Spread the love