అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకత్వం వహించారు. క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గోజల మహేశ్వర్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు ఓటీటీ మాధ్యమం’ఆహా’లో విడుదలై, ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, ‘ఈ సినిమాపై మొదటి నుంచి చాలా నమ్మకంగా ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. సినిమా చూసిన వారంతా గొప్పగా అభినందిస్తున్నారు. చాలా ఎంజారు చేస్తున్నారు. ముఖ్యంగా అభినవ్ గోమటం నటనని ఆస్వాదిస్తున్నారు. పరిశ్రమ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు తప్పకుండా చూడండి. పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి’ అని అన్నారు. ‘ఇది నా ఫస్ట్ రిలీజ్. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. అభినవ్, శాలినితో వర్క్ చేయడం చాలా అనందంగా ఉంది. ఈ సినిమా నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది’ అని యాక్టర్ నిఖిల్ చెప్పారు. దర్శకుడు బీఎస్ సర్వాంగ కుమార్ మాట్లాడుతూ,’ఈ సినిమా మా అందరికీ గొప్ప అవకాశాలు తెచ్చిపెట్టింది. అభినవ్ చాలా సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ ఝాన్సీ చాలా మంచి లుక్ తీసుకొచ్చారు. అజరు అర్సాడా మ్యూజిక్తో సినిమాని ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. శాలిని మంచి రచయిత, నటి. వీరందరితో కలసి మళ్ళీ వర్క్ చేయాలని ఉంది’ అని అన్నారు. ఆహా మార్కెటింగ్ హెడ్ రాజశేఖర్ మాట్లాడుతూ,’ ‘ఈ సినిమా ప్రేక్షకుల మనసులో మంచి స్థానం సంపాదించుకుంది. ఇది బిగ్ స్మాల్ ఫిల్మ్. ఇప్పటివరకూ 25 లక్షల మంది చూశారు. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని తెలిపారు.