సాధకుల స్ఫూర్తితో అనాథలకు అండగా

నవతెలంగాణ-హన్మకొండ
జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నక్కలగుట్ట హరిత కాకతీ యలో జరుగుతున్న యోగ శిక్షణ శిబిర సాధకుల సహాయ సహ కారాలతో హనుమకొండలోని ఆశ్రమాల్లో ఉంటున్న వారికి అండగా నిలుస్తున్నామని ప్రముఖ యోగాగురువు పోశాల శ్రీనివాస్‌ తెలిపారు. గత మూడేళ్లుగా ప్రతిరోజు యోగాశిక్షణ తరగతులు జ రుగుతున్నాయని, ఈయోగా సాధకుల స్ఫూర్తి, పూర్తి సహకారం తో హనుమకొండలోని వివిధఆశ్రమాలకు నిత్యవసర వస్తువులైన బియ్యం, బట్టలు, పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ బుధవారం జిల్లా కోర్టు సూపరింటెండెంట్‌ ఇందిరా సహకారంతో 50 కేజీల బియ్యాన్ని ఆశ్రమాలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్‌ రెడ్డి, రాజా, ఆనందంలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love