కోహెడ నూతన తహసిల్దార్ గా సురేఖ 

నవతెలంగాణ-కోహెడ
కోహెడ మండల తహసిల్దారుగా సురేఖ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.  తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన తహసీల్దారుల బదిలీల ప్రక్రియలో భాగంగా ప్రస్తుత కోహెడ మండలంలో పనిచేస్తున్న తహసిల్దార్ జావిద్ అహ్మద్ రాజన్న సిరిసిల్ల జిల్లా కి బదిలీపై వెళ్ళిగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో తహసిల్దార్ గా విధులు నిర్వర్తించి  కోహెడ మండలానికి బదిలీపై వచ్చారు .ఈ సందర్భంగా నయాబ్ తాసిల్దార్ రాజి రెడ్డి  స్వాగతం పలికి కార్యాలయ సిబ్బందిని పరిచయం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపినారు. ఈ కార్యక్రమంలో నయాబ్ తాసిల్దార్ రాజి రెడ్డి సీనియర్ నాయకులు జి సురేందర్, మండల రెవెన్యూ పరిశీలకులు ఎం హరీష్ కుమార్, టైపిస్ట్ లక్ష్మీ, విద్యుల్లత, కంప్యూటర్ ఆపరేటర్స్ బాలకృష్ణ, ధరణి ఆపరేటర్ హరీష్, గ్రామ రెవెన్యూ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love