![](https://navatelangana.com/wp-content/uploads/2023/10/1696936831283.jpg)
మండలంలోని దాస్ నగర్ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుచున్న కోలి త్రిష ఇటీవల సౌత్ ఆఫ్రికా దేశములో జరిగిన 5వ వరల్డ్ కప్ అంతర్జాతీయ టెన్నికాయిట్ ఆటలో తన ప్రతిభను కనపరిచి ఈ సువర్ణ పధకాన్ని సాధించింది. ఈ సందర్భంగా కళాశాల అధ్వర్యంలో ఆమెను మంగళవారం అభినందించారు. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపాల్ డా. కే. లావణ్య మాట్లాడుతు ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని విద్యాలయాలను ప్రోత్సమించారు. ఈ తరపున కాలేజీ యాజమాన్యం ఆ కొలి త్రిషను ఘనంగా పూలమాలతో సత్కరించారు.