దూపల్లి గ్రామంలో ఘనంగా స్వామి వివేకానందు జయంతి…

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో సర్పంచ్ శనిగరం సాయి రెడ్డి, గ్రామ కమిటీ సభ్యులు లింగన్న యాదవ్, నాగరాజ్, సొసైటీ చైర్మన్ శేషు గారి బొమ్మ రెడ్డిలు స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. వివేకానంద జయంతి & జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని యువతకు జిల్లా పరిషత్ పాఠశాల వ్యాచారచన పోటీలతో పాటు, వాలీబాల్ వివిధ క్రీడలు నిర్వహించి వారికి బహుమతులను అందజేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మొగులాబాయి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు లింగన్న యాదవ్, నాగరాజ్, పోశెట్టి, స్థానిక యువత పాల్గొన్నారు.
Spread the love