బిఎల్ఓ లతో సమీక్ష నిర్వహించిన తహసిల్దార్ 

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి తహశీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రామచందర్ రావు ఆధ్వర్యంలో ఎలెక్టోరల్ రోల్ డ్రాఫ్ట్ పబ్లికేషన్స్ గురించి  బిఎల్ఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలెక్టోరల్ రోల్ ని సంబంధిత నోటీస్ బోర్డ్ పై పేస్ట్ చేయమని సంబంధిత ఉద్యోగులకు సూచించారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆగస్టు 26,27  సెప్టెంబర్ 2,3 తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహించి, క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ 19-09-2023 వరకు స్వీకరించబడునని అన్నారు. సమావేశంలో డిటి రాకేష్, సెక్రటరీలు పూరెల్లి ఆకాష్, ఇరుగురాల శ్రీనివాస్, అల్లి రామ్మోహన్, అమల, శ్యామ్, శ్రీనివాస్, ఆశ వర్కర్లు మేడాస్వరూప, పంజా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Spread the love