ఆ రెండు రోజులు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికకు పోలింగ్ జరగనున్నాయి. ఈ ఫలితాలు జూన్ 4న తేలనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు రోజులను వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

Spread the love