నవతెలంగాణ – అచ్చంపేట
మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి కురిసిన గాలివానకి గ్రామంలో ఓ ఇంటి పైకప్పులు రేకులు కొట్టుకపోయాయి. జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మంగళవారం ఇండ్లను పరిశీలించారు. రేకులు కొట్టుకపోయిన ఇళ్లకు మళ్లీ రేకులు వేసుకునేందుకు సహాయం చేస్తానని బాధితులకు భరోసా కల్పించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ ఉన్నారు.