పెరిగిన బంగారం ధరలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : పసిడి ప్రియులకు షాక్.. మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా ఇది ఇలా ఉండగా.. తాజాగా  హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 పెరిగి రూ. 62, 950 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 57, 700 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 77, 500 గా నమోదు అయింది. అయితే.. మరో ఏడాదిలోపు.. దేశ వ్యాప్తంగా తులం బంగారం ధర 70 వేలు చేరే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.

Spread the love