నవతెలంగాణ- హైదరాబాద్ : మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం.ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 64, 090 గా నమోదు కాగా అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 58, 750 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 300 పెరిగి రూ. 80,300 గా నమోదు అయింది. అయితే.. మరో ఏడాదిలోపు.. దేశ వ్యాప్తంగా తులం బంగారం ధర 70 వేలు చేరే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.