అమెరికాలో తెలంగాణవాసి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో తెలంగాణవాసి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన విద్యుత్ శాఖలో పనిచేస్తూ రిటైరైన వెంకటరమణ, మధురల కుమారుడు అబ్బరాజు పృథ్విరాజ్ 8 సంవత్సరాల క్రితం అమెరికాకు ఉద్యోగరీత్య వెళ్లాడు. కాగా అమెరికాలోని చొర్లెట్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన మృతదేహం శని, ఆదివారాల్లో మన దేశానికి వచ్చే అవకాశం ఉంది. మృతుడు బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్ కుమార్ దేశపాండే మేనల్లుడు. కాగా మృతుడికి ఇటీవల శ్రీప్రియ తో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు హైదరాబాద్ ఎల్బీనగర్ లో నివాసం ఉంటున్నారు.

Spread the love