ఎన్నికల ప్రచారంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..

నవతెలంగాణ – తొగుట
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభం నుండి సహ కరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం నుండి నాకు సహకరించిన నాయకుల కు, కార్యకర్తలకు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పెరు పేరున కృతజ్ఞతలని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను,అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారం టీలను, మేనిపేస్టో గురించి ప్రజలకు వివరించిన వారికి ధన్యవాదాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అమలు చేస్తుందని,ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీద, నిరుపేద వర్గాలకు ఎంతో మేలు చేకూరు తుందన్నారు.
Spread the love