బిడ్జీ పైనుండి గౌరారం వాగులో పడ్డ కారు

మెకానిక్‌ సందీప్‌ మృతి
నవతెలంగాణ-మంగపేట
మంగపేట నర్సాపురం గ్రామాల మద్య గౌరారంవాగుపై ఇటీవల నిర్మించిన కొత్త బ్రిడ్జీ పై నుండి కారు వేగం అదుపుతప్పి వాగులో పడిపోయిన ఘటనలో నర్సాపురం బోరు గ్రామానికి చెందిన నార సందీప్‌(32) అనే బైక్‌ మెకానిక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం సుమారు 12.20 నిమిషాల సమయంలో సందీప్‌ తన స్వతం కారులో మంగపేట నుండి తన ఇంటికి వెల్లున్న క్రమంలో కారు వేగం అదుపు తప్పి బ్రిడ్జీ ఎడమవైపు ఉన్న మూడు రెయిలింగ్‌ పోల్స్‌ను ఢ కొట్టి గౌరారం వాగులో పడిపోయినట్లు తెలిపారు. బ్రిడ్జీ నిర్మాణం సమయంలో సుమారు 15 మీటర్ల లోతు 30 మీటర్ల వెడల్పుతో ఇసుకను తొలగించి కాంక్రీటు రాళ్లు వేయ డంతో లోతుగా నీరు ఉండడంతో కారు వాగులో పడిపోవడంతోనే మునిగి సందీప్‌ మృతి చెందినట్లు తెలిపారు. కారు వాగులో పడిన పది నిమిషాల్లోనే మంగపేట, నర్సాపురం గ్రామాలకు చెందిన వందలాది మంది యువకులు ఘటనా స్థలానికి చేరుకుని గంటపాటు సహాయక చర్యలు చేపట్టి వాగులో మునిగిన కారును బయటకుతీసినప్పటికీ అప్పటికే సందీప్‌ మతి చెందాడు. సందీప్‌ మండల కేంద్రం కోమటిపల్లి రోడ్డులో ఐదు సంవత్సరాలుగా బైక్‌ మెకాని క్‌గా పని చేస్తున్నాడు. మృతునికి భార్య పిల్లలున్నట్లు తెలిపారు. సందీప్‌ మృతితో ఆయన తల్లి తండ్రి తమ్ముల్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love