పరిస్థితి విషమించి మహిళ మృతి..

నవతెలంగాణ – బెజ్జంకి

చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని దాచారం గ్రామ అనుబంద గ్రామం రామసాగరంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గణపురం నర్మద(28)కుటుంబ సభ్యులతో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తలెత్తాయి. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో మంగళవారం నర్మద పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో 108 అంబులెన్స్ యందు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది.మృతురాలికి ఒక కుమారుడు,కూతురు సంతానం.మృతురాలి తల్లి కుసుంబ అంజవ్వ పిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు.
Spread the love