– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రాములు,జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
ప్రతి ఓటరూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ. జహంగీర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వ్యకాస రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రాములు, జిల్లా కార్యదర్శి కందు కూరి జగన్లు అన్నారు. బుధవారం మంచాల మండల పరిధిలోని లోయపల్లిలో వ్యకాస ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గతంలో సీపీఐ (ఎం) మద్దతుతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చి మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారని ఉపాధి హామీ పని చట్టం తీసుకవస్తనే సీపీఐ(ఎం) కాంగ్రెస్ మద్దతు నిచ్చారని ఉపాధిహామీ పథకం ఎర్రజెండా ద్వారానే వ చ్చిందని ప్రతి కూలీ గుర్తించాలన్నారు. ఎన్నో ప్రజా సమ స్యల పరిష్కారం ఎర్ర జెండాతోనే సాధ్యమయ్యాయన్నా రు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేయాల ని చూస్తుందన్నారు. ప్రతి ఓటరూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండీ జహంగీర్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్ర మంలో మండల కార్యదర్శి వర్గ స భ్యులు సిలివేరు రాజు, ఎస్ఎఫ్ఐ.జిల్లా కార్యదర్శి బి.శంకర్, పార్టీ గ్రామశాఖ కా ర్యదర్శులు ముక్కమ్ వెంకటేష్, సిద్ద గొని మహేష్,మాజీ ఉపసర్పంచ్ బొట్టు జానీ, నాయకులు గంపెల్లి రాజు, ఊరు పక్క యాదయ్య, రవన్న, ఊరపక్క లింగం, కిరణ్, శివ మణి,చాంద్ పాషా, లక్ష్మన్, సురేష్, నిఖిల్, నవీన్, రాజు, స్టాలిన్,వెంకీ తదితరులు పాల్గొన్నారు.