గడ్డం వంశీకే ఎమ్మార్సీస్ నాయకుల మద్దతు

The Gaddam Vamsi is supported by the leaders of Emarces– ఎమ్మార్పీఎస్ కాటారం సబ్ డివిజన్ ఇంఛార్జి చంద్రగిరి అశోక్
నవతెలంగాణ మల్హర్ రావు.
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకే కాటారం సబ్ డివిజన్ ఎమ్మార్పీఎస్ నాయకుల పూర్తి మద్దతు ఉంటుందని కాటారం సబ్ డివిజన్ ఎమ్మార్పీఎస్ ఇంఛార్జి చంద్రగిరి అశోక్ తెలిపారు.మంగళవారం కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శీను బాబు, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను కాటారం సబ్ డివిజన్ ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణ కే తమ మద్దతు ప్రకటించడంతోపాటు వంశీని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాటారం సబ్ డివిజన్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ చంద్రగిరి అశోక్ మాదిగ, కాటారం మండల ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షుడు చిట్యాల చంద్రయ్య మాదిగ, కాటారం మండల ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కోటపర్తి శ్రీనివాస్ మాదిగ, మలహర్ మండల ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షుడు సంపత్ మాదిగ,కాటారం మండల ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి గద్దల మహేష్ మాదిగ, కాటారం మండల ఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షులు మంతెన రాకేష్ మాదిగ,పలిమేల అధ్యక్షుడు జిల్లెల నాగరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు కార్తీక్,ఆత్కూరి భాస్కర్, రాకేష్ నరేష్ ఆకాష్ మహేష్ మారపాక పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love