నవతెలంగాణ- హైదరాబాద్ : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న న్యూజిలాండ్ టెస్టుఆటగాడు హెన్నీ నికోల్స్(Henry Nicholls)కు భారీ ఊరట లభించింది. న్యూజిలాండ్ క్రికెట్ అతడిని నిర్దోషిగా తేల్చింది. శనివారం నికోల్స్ స్వతంత్ర కమిషనర్ ముందు హాజరయ్యాడు. అతడి వాదనలు విన్న కమిషనర్లు లీ రాబిన్సన్, జాన్ గ్రీన్వుడ్, మ్యాచ్ అంపైర్లు కిమ్ కాటన్, డెరెక్ వాకర్, కంటెర్బరీ కోచ్ పీటర్ ఫుల్టన్.. నికోల్స్ ఏమంత పెద్ద నేరానికి పాల్పడలేదని, అతడిపై చర్యలు తీసుకునేందుకు సరైన ఆధారం లేదని స్పష్టం చేశారు. దాంతో, బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడేందుకు నికోల్స్కు లైన్ క్లియర్ అయింది.