అధికారులతో సమావేశం నిర్వహించిన మేయర్

నవతెలంగాణ – కంటేశ్వర్ 
నగరంలోని మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని శుక్రవారం నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ నిర్వహించారు. నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్షించి  సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని, పనుల పురోగతిపై ఆధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ మురళి మనోహర్ రెడ్డి, డీసీపీ శ్యామకుమార్, పంచాయతీ రాజ్ ఎగ్జిక్సుటివ్ ఇంజనీర్ శంకర్, ఎలక్ట్రిసిటీ డి.ఈలు రాజశేఖర్, వీరేశం, చంద్ర శేఖర్, మున్సిపల్ డి. ఈలు ఆనంద్ సాగర్, ముస్తాక్ అహ్మద్, రెవిన్యూ ఆఫీసర్ నరేందర్, ఎం.హెచ్.ఓ సాజిద్ అలీ, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు  తదితరులు పాల్గొన్నారు.
Spread the love