తిరువనంతపురం : ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసేలా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు 2024 లోక్సభ ఫలితాలు గట్టి దెబ్బ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం అన్నారు. కాషాయ పార్టీకి అనుకూలంగా చేసిన ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై విజయన్ స్పందిస్తూ మతతత్వాన్ని ఉపయోగించి ముందుకు సాగాలన్న బీజేపీ ఎత్తులను భారత ప్రజలు విచ్ఛిన్నం చేశారని అన్నారు. త్రిసూర్లో బీజేపీ విజయాన్ని చాలా సీరియస్గా చూస్తున్నామని, దీనిపై సమీక్ష చేయనున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.