లూటీ చేస్తున్న పాలకులకు బుద్ధి చెప్పాలి

లూటీ చేస్తున్న పాలకులకు బుద్ధి చెప్పాలి :– ఒడిశా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ
ఒడిశా : గత పదేండ్ల పాలనలో తమ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతి బాట పట్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న పాలకులకు బుద్ధి చెప్పి, ఈసారి ఒడిశా ప్రజలు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిశాలోని కేంద్రపారాలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మోడీ మాట్లాడారు. దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో భారీ కుంభకోణాలు మినహా ఎలాంటి అభివద్ధి జరగలేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Spread the love