నవతెలంగాణ-బెజ్జంకి: కంటి చూపును ప్రసాదిస్తున్న రేకుర్తి లయన్స్ క్లభ్ సేవలు అభినందనీయమని సర్పంచ్ ద్యావనపల్లి మంజుల హర్షం వ్యక్తం చేశారు.గురువారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యలయంలో లయన్స్ క్లభ్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిభిరాన్ని సర్పంచ్ ద్యావనపల్లి మంజుల ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లభ్ కంటి వైద్య నిపుణులు చింతల ప్రభాకర్ రోగులను పరిక్షించి శస్త్ర చికిత్స కోసం రేకుర్తి లయన్స్ క్లభ్ ఆస్పత్రికి తరలించారు. లయన్స్ క్లభ్ అధ్యక్షుడు భరత్ సింగ్, కార్యదర్శి కొండ శ్రీనివాస్, కోశాధికారి సత్తయ్య, సుదర్శన్ రెడ్డి, మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.