కన్న తల్లిపై కాలుతో తన్ని విచక్షణ రహితంగా దాడి చేసిన కుమారుడు

– ఆసుపత్రిలో దీనస్థితిలో చికిత్స పొందుతున్న కన్నతల్లి
– కొడుకు పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గౌతమ్ నగర్ ప్రాంతంలో కన్నా తల్లిపై కొడుకు కాళ్లతో తన్ని కొట్టిన ఘటన మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వ్యవహరించిన ఘటన కన్నతల్లి పై కొడుకు ఇలా వ్యవహరించి కొట్టడం చాలా దారుణమని స్థానికులు అంటున్నారు. విచక్షణారహితంగా కాలితో తన్నుతూ ముఖంపై పిడి గుద్దులు కురిపిస్తూ దాడికి పాల్పడ్డాడు. దాడికి గల కారణాలు తెలియ రాలేదు.కనీసం తిరగబడి ప్రతిఘటించలేని తల్లి కన్నీరు మున్నీరుగా విలపించిన ఈ హృదయ విదారక ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లో గొల్ల గంగామణి నివాసం ఉంటుంది. గంగామణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం పెద్ద కుమారుడు మరణించాడు. చిన్న కుమారుడు గొల్ల పవన్ కుమార్ మేస్త్రీ పని పనిచేస్తూ దుబ్బ ప్రాంతంలో నివాసం ఉంటాడు. ఆదివారం గౌతమ్ నగర్ లోని పెద్ద కుమారుడి వద్ద ఉన్న గొల్ల గంగామణి వద్దకు గొల్ల పవన్ కుమార్ వచ్చాడు. అకారణంగా తల్లిపై దుర్భాషలాడుతూ కాలితో తన్నుతూ విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. కనీసం పైకి లేచే ఓపిక లేక పోవడంతో కన్నీరు మున్నిరైన తల్లి వేదన అరణ్య రోదనగా మారింది… వెంటనే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పవన్ కుమార్ వెళ్లిపోయాడు. ఈ దాడిలో రక్తపు మడుగులో తీవ్ర గాయాలైన గంగామణిని స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొఖం, కంటి, దవడ భాగంలో ఎముకలు విరిగి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి మెరుగుపడితే గాని ఏమి చేయాలని పరిస్థితులలో ఉన్నట్లు తెలుస్తుంది కానీ ప్రస్తుతం పోలీసులు మాత్రం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం.
Spread the love