నవతెలంగాణ – హైదరాబాద్: రేపటి నుంచి TSRTC బస్సుల్లో మహిళలకు రూ. 0 టికెట్ ఇవ్వనున్నట్లు MD సజ్జనార్ తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు స్థానికత ధ్రువీకరణ కోసం తమ ఆధార్/ఇతర గుర్తింపు కార్డు చూపించి విధిగా జీరో టికెట్ తీసుకోవాలని కోరారు. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు టిమ్ మెషీన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినట్లు చెప్పారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నామని సజ్జనార్ వివరించారు.
‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమల్లో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు @TSRTCHQ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC) తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో… pic.twitter.com/XgPKGPqtpf
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 14, 2023