తీగలకుంటపల్లి కాంగ్రెస్‌ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ-కోహెడ
మండలంలోని తీగలకుంటపల్లి గ్రామంలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ గ్రామశాఖ నూతన కమిటీని మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్‌, కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు బస్వరాజు శంకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, హుస్నాబాద్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిల ఆదేశాల మేరకు కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. అలాగే అధ్యక్షుడిగా కోతి ఉదయ్‌భాస్కర్‌, ఉపాధ్యాక్షుడిగా మహ్మద్‌ షరీఫ్‌, కార్యదర్శిగా బస్వరాజు బాలయ్య, కోశాధికారిగా జాలిగాం యాదగిరి, కార్యవర్గ సభ్యులుగా బస్వరాజు కిష్టయ్య, లింగపల్లి నర్సింహులు, జాలిగాం కనుకయ్య, ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డిలు ఎన్నికయ్యారు. అలాగే యువజన కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా మహ్మద్‌ యాకూబ్‌, ఉపాధ్యాక్షుడిగా ఇట్టిరెడ్డి అజయ్‌రెడ్డి, ఇట్టిరెడ్డి హరీష్‌రెడ్డి, కార్యదర్శిగా మెట్టు అజయ్‌రెడ్డి, కోశాధికారిగా మహ్మద్‌ అరీఫ్‌, జాలిగాం సంతోష్‌, రేవోజు అరవింద్‌, సోషల్‌మీడియా ఇంఛార్జీగా ఇట్టిరెడ్డి రజనీకాంత్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దూలం శ్రీనివాస్‌గౌడ్‌, నంగునూరి శ్రీనివాస్‌, బస్వరాజు రమేష్‌, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love