నవతెలంగాణ – హైదరాబాద్ : “ఇది నా తొలి ఐపీఎల్ సెంచరీ. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో, గెలవాల్సిన మ్యాచ్లో ఇది రావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది” అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన కీలక మ్యాచ్లో అయ్యర్ (101 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగాడు. దీంతో పంజాబ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా ఆరు పరాజయాల తర్వాత ఈ గెలుపు పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలిపింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం అయ్యర్ మాట్లాడుతూ.. “నిజాయతీగా చెప్పాలంటే ఉప్పొంగిపోతున్నాను. ఆరు వరుస ఓటముల తర్వాత మేం చివరికి గెలిచాం. ఇది జట్టులో గొప్ప ఉత్సాహాన్ని నింపింది. రేపు ముంబై ఇండియన్స్కు మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నాను” అని వ్యాఖ్యానించాడు. తన బ్యాటింగ్ శైలి గురించి అయ్యర్ వివరిస్తూ.. “ఒక సెంచరీతో మ్యాచ్ను ముగించడం అనేది ప్రతి బ్యాట్స్మెన్ కల కనే అద్భుతమైన అనుభూతి. ఈ రోజు నేను గొప్ప మానసిక స్థితిలో ఉన్నాను. పిచ్ను అంచనా వేయగలిగాను. పరిస్థితులను అర్థం చేసుకుని ఆడటం పరుగులు చేయడానికి సహాయపడింది. ప్రభ్సిమ్రాన్తో భాగస్వామ్యం చాలా కీలకం. అతడు బౌలర్లపై ఎదురుదాడి చేసిన తీరు అమోఘం. మేమిద్దరం సమన్వయంతో ఆడటం వల్లే విజయం సాధ్యమైంది” అని తెలిపాడు.



