ఈ సమాజానికి నవతెలంగాణ పత్రిక అవసరం..

– జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ గోపిడి 
నవతెలంగాణ – అచ్చంపేట : పత్రికలు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని,  ఈ సమాజానికి నవ తెలంగాణ పత్రిక  చాలా అవసరం అని జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ గోపిడి అన్నారు. మంగళవారం స్థానిక ఫారెస్ట్ కార్యాలయంలో నవ తెలంగాణ 2024 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు పాఠకులకు, సిబ్బందికి ఉద్యోగులకు  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ కాలంలో నవతెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి లక్పతి నాయక్,  డివిజన్ రిపోర్టర్ కాలూరి శ్రీను , రూరల్ రిపోర్టర్ నారాయణ రావు లు ఉన్నారు.
Spread the love