కర్నాటకలో టెంపో బోల్తా పడి ముగ్గురు మిరప రైతులు మృతి

నవతెలంగాణ – కర్నాటక: కర్నాటకలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగలాపురం గ్రామానికి చెందిన ముగ్గురు మిరప రైతులు మృతి చెందారు. మండల పరిధిలోని నాగలాపురం గ్రామానికి చెందిన రైతులు తాము పండించిన మిరప పంటను కర్నాటకలోని బ్యాడిగ మార్కెట్‌ కు ఆదివారం టెంపోలో తీసుకుని వెళుతుండగా, దావణగేరి సమీపంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని నాగలాపురం గ్రామానికి చెందిన రైతులు మస్తాను, పెద్ద యంకన్న, మంత్రాలయం మండలం సింగరాజనహళ్లి గ్రామానికి చెందిన ఆటో ఈరన్న అనే రైతులు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో జంట గ్రామాలకు చెందిన ముగ్గురు మిరప రైతులు మృతి చెందడంతో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Spread the love