రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మండలం అనాజిపురం చౌరస్తాలో ఆదివారం ఆటోను లారీ ఢకొీట్టడంతో ముగ్గురికితీవ్రగాయాల య్యాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామానికి చెందిన భార్యాభర్తలు నర్సింహ, రాములమ్మ కొత్తపల్లి గ్రామానికి చెందిన బాలె కృష్ణ ఆటోలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామానికి వెళుతున్నారు.మోత్కూరుమండలం అనాజిపురం ఎక్స్‌రోడ్డు వద్దకు రాగానే వలిగొండ నుంచి తిరుమలగిరి వైపు వెళుతున్న లారీ ఆటోను ఢకొీట్టింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.వారికి స్థానికంగా చికిత్స చేయించి 108లో మోత్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ లారీని అక్కడే వదిలి పరారైనట్టు తెలిసింది.

Spread the love