నవతెలంగాణ-మేడ్చల్
మేడ్చల్ మండల పరిధిలోని రావల్కోల్ గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా, జీఎంపీఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం బోగి పండుగ సందర్భంగా ముగ్గులు, స్లో బైక్ రేసింగ్ పోటీలు నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత, జిల్లా కార్యదర్శి వినోదలు మాట్లాడుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గులు, స్లో బైక్ రేసింగ్ పోటీలలో మహిళలు, యువకుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి నిర్వహించామని తెలిపారు. యువత బైకులు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి ఎక్కాలదేవి కీర్తన, ద్వితీయ బహుమతి చుక్క రోజా, తృతీయ బహుమతి గుంటి కస్తూరి, నాలుగో బహుమతి గోపన శిరీష, ఐదో బహుమతి సుక్క భాగ్యలక్ష్మీలు గెలిచినట్లు తెలిపారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి పట్టు చీరలు, స్లో బైక్ రేసింగ్ లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రమేష్ రూ.2 వేలు హెల్మెట్, ద్వితీయ బహుమతి నర్సాపురం మనోజ్ రూ.1500 హెల్మెట్, తృతీయ బహుమతి వేయి రూపాయలు హెల్మెట్, నాలుగో బహుమతి బంటు, నవీన్లకు హెల్మెట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు నరేష్, వైస్ ఎంపీపీ గోపని వెంకటేష్, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి ఎక్కాలదేవి కొమరయ్య, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్, ఐద్వా నాయకులు రాజకుమారి, బాలమణి, భాషమ్మ, పూజ, మత్స్య సంఘం నాయకులు యాదగిరి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.