జేసిబితో ఇల్లు కూల్చిన దుండగులు

– కుటుంబ సభ్యులపై భౌతిక దాడి
– పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు
నవతెలంగాణ- ఖమ్మం
నగరంలోని శ్రీనగర్‌ కాలనీ రోడ్డు నెంబర్‌ 15లో తన ఇంటి మీదకు కోన లక్ష్మణ్‌ రావు, వాసిరెడ్డి శ్రీనివాసరావు, పెరుగు వెంకట రమణ, లక్ష్మణ్‌ రావు అనే వ్యక్తులు 50 మంది గూండాలతో వచ్చి జేసిబితో ఇల్లు కూల్చి వేశారని బాధితురాలు చెపూరి పద్మ ఆరోపించారు. సర్వే నెంబర్‌ 494 వెలుగుమట్ల రెవెన్యూలో ఉన్న 267 గజాల స్థలంలో పక్క ఇల్లు నిర్మించుకుని తన నలుగురు అడపిల్లలతో కలిసి జీవిస్తున్నట్లు తెలిపారు. కోన లక్ష్మణ్‌ రావు ఫేక్‌ డాక్యుమెంట్లతో స్థలం తనదేనని కోర్ట్‌లో కేసు వేసినట్లు పద్మ ఆరోపించారు. న్యాయస్థానం స్థల డాక్యుమెంట్లను రెండు సార్లు తనకు ఫెవర్‌ గా జడ్జిమెంట్‌ ఇచ్చినట్లు చెప్పారు. గత రెండు నెలలు గా సదరు వ్యక్తులు గుండాలను తీసుకొచ్చి ఇల్లు ఖాళీ చేయాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో శుక్రవారం 50 మంది గుండాలతో కర్రలతో ఇంటిపై కి వచ్చి కుటుంబ సభ్యులపై భౌతిక దాడి చేసినట్లు తెలిపారు.జేసిబితో ఇంటి సైడ్‌ ప్రహరీ, టారు లెట్స్‌ ను పూర్తిగా కూల్చి వేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఖానాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఘటనపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.స్టేషన్‌లో తమకు న్యాయం జరుగుద్దని నమ్మకం లేదని కన్నింటి పర్యంతం చెందారు. అనంతరం పోలీసులు ఫిర్యాదు చేశారు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ భానుప్రకాష్‌ తెలిపారు.

Spread the love